లాక్ డౌన్ కారణంగా 2 నెలలుగా థియేటర్లు మూతపడి ఉండటం.. ఇంకో నాలుగైదు నెలలు అవి తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీల హవా నడుస్తోంది. సినిమాల సందడంతా అక్కడే ఉంది. జనాలు మునుపెన్నడూ లేని విధంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో విరగబడి సినిమాలు చూస్తున్నారు.
వాటి ఆదాయం కూడా లాభ సాటిగా ఉండటం.. కంటెంట్ కోసం డిమాండ్ కూడా పెరుగుతుండటంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్ని నేరుగా తమ వేదికలపై రిలీజ్ చేసేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ క్రమంలోనే నాని, సుధీర్ బాబుల కలయికలో ఇంద్రగంటి మోహన కృష్ణ రూపొందించిన క్రేజీ మూవీ వి ఓటీటీలో డైరెక్టుగా రిలీజవుతుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. తమ సినిమా అలా రిలీజ్ కాదని నిర్మాత దిల్ రాజు ప్రకటించినప్పటికీ.. ఓటీటీలతో చర్చలైతే జరిగినట్లు, జరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో సుధీర్ బాబును అడిగితే.. ఓ ఆసక్తికర విషయం చెప్పారు.
వి సినిమాను సగం వరకు ఓటీటీలో రిలీజ్ చేసి.. మిగతా సగంపై ఉత్కంఠ రేకెత్తిద్దామన్న ఆలోచన ఒక దశలో వచ్చిందన్నాడు. ఇలా చేసి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే తరహాలో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించి వి సెకండాఫ్ చూసేందుకు థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూసేలా చేయాలనుకున్నట్లు తెలిపాడు.
కానీ ఆ ఆలోచన తర్వాత విరమించుకున్నామన్నాడు. వి థియేటర్లలో ఎంజాయ్ చేసే సినిమా అని.. చిన్న తెరలపై దాన్ని రిలీజ్ చేయడం బాగుండదని భావించామని, దీనిపై చిత్ర బృందంలో అందరూ మాట్లాడుకుని వెనక్కి తగ్గామని చెప్పాడు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…