Movie News

వి సినిమాలో స‌గం ఓటీటీకి ఇద్దామ‌నుకున్నార‌ట‌

లాక్ డౌన్ కార‌ణంగా 2 నెల‌లుగా థియేట‌ర్లు మూత‌ప‌డి ఉండ‌టం.. ఇంకో నాలుగైదు నెల‌లు అవి తెరుచుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఓటీటీల హ‌వా న‌డుస్తోంది. సినిమాల సంద‌డంతా అక్క‌డే ఉంది. జ‌నాలు మునుపెన్న‌డూ లేని విధంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో విర‌గ‌‌బ‌డి సినిమాలు చూస్తున్నారు.

వాటి ఆదాయం కూడా లాభ సాటిగా ఉండ‌టం.. కంటెంట్ కోసం డిమాండ్ కూడా పెరుగుతుండ‌టంతో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సినిమాల్ని నేరుగా త‌మ వేదిక‌ల‌పై రిలీజ్ చేసేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే నాని, సుధీర్ బాబుల క‌ల‌యిక‌లో ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ రూపొందించిన క్రేజీ మూవీ వి ఓటీటీలో డైరెక్టుగా రిలీజ‌వుతుంద‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. త‌మ సినిమా అలా రిలీజ్ కాద‌ని నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఓటీటీల‌తో చ‌ర్చ‌లైతే జ‌రిగిన‌ట్లు, జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు. ఇప్పుడు ఇదే విష‌య‌మై ఓ ఇంట‌ర్వ్యూలో సుధీర్ బాబును అడిగితే.. ఓ ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పారు.

వి సినిమాను స‌గం వ‌ర‌కు ఓటీటీలో రిలీజ్ చేసి.. మిగ‌తా స‌గంపై ఉత్కంఠ రేకెత్తిద్దామ‌న్న ఆలోచ‌న ఒక ద‌శ‌లో వ‌చ్చింద‌న్నాడు. ఇలా చేసి క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే త‌ర‌హాలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తించి వి సెకండాఫ్ చూసేందుకు థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం ఎదురు చూసేలా చేయాల‌నుకున్న‌ట్లు తెలిపాడు.

కానీ ఆ ఆలోచ‌న త‌ర్వాత విర‌మించుకున్నామ‌న్నాడు. వి థియేట‌ర్ల‌లో ఎంజాయ్ చేసే సినిమా అని.. చిన్న తెర‌ల‌పై దాన్ని రిలీజ్ చేయ‌డం బాగుండ‌ద‌ని భావించామ‌ని, దీనిపై చిత్ర బృందంలో అంద‌రూ మాట్లాడుకుని వెన‌క్కి త‌గ్గామ‌ని చెప్పాడు.

This post was last modified on May 11, 2020 10:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

4 hours ago