టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు ఈ రోజు. అతడి జన్మదిన వేడుకలు నిన్న అర్ధరాత్రే మొదలయ్యాయి. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల మధ్య అతను పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ వ్యక్తుల్లో గాయని సునీత, ఆమె భర్త రామ్ ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
ఇంతకుముందెన్నడూ నితిన్ ఆప్త మిత్రుల్లో ఒకరిగా సునీత కనిపించలేదు. ఇప్పుడు నితిన్ పుట్టిన రోజు వేడుకల్లో సునీత ఉండటానికి కారణం ఆమె భర్త రామ్. ఒక యూట్యూబ్ మీడియా సంస్థను నడుపుతున్న రామ్.. నితిన్కు చాలా క్లోజ్ అని చాలామందికి తెలియదు. రామ్, సునీత బంధం బలపడటంతో, వారి పెళ్లి జరగడంలో నితిన్ పాత్ర కీలకం అంటారు. వీరి పెళ్లి రిసెప్షన్ను నితిన్ దగ్గరుండి జరిపించడం.. ఆ వేడుకను హోస్ట్ చేయడం విశేషం.
ఈ నేపథ్యంలోనే నితిన్ పుట్టిన రోజు వేడుకల్లో సునీత, రామ్ ప్రత్యేకంగా కనిపించారు. ఇండస్ట్రీలో నితిన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన కూడా ఈ వేడుకలో పాల్గొంది. నితిన్ పక్కన అతడి సతీమణి షాలిని కూడా ఉంది. ఈ పుట్టిన రోజుకు నితిన్ చాలా సంతోషంగా ఉన్నాడు. పెళ్లి తర్వాత జరుగుతున్న తొలి పుట్టిన రోజు ఇదే కాగా.. సరిగ్గా ‘రంగ్ దే’ సినిమాతో మంచి విజయాన్నందుకున్న సమయంలో బర్త్ డే రావడం సంతోషాన్ని రెట్టింపు చేసేదే.
గత నెలలో ‘చెక్’తో షాక్ తిన్న నితిన్.. ‘రంగ్ దే’ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. సోమవారం హోలి సెలవును బాగా ఉపయోగించుకున్న ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.13 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇక నితిన్ పుట్టిన రోజు కానుకగా అతడి కొత్త సినిమా ‘మాస్ట్రో’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం తెలిసిందే.
This post was last modified on March 30, 2021 1:02 pm
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…