Movie News

పెళ్లి తర్వాత సినిమాలు.. మెహ్రీన్ మాటేంటి?

ఈ మధ్య బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సౌత్ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. వరుణ్‌కు పెళ్లి కావడంతో ఒక మంచి ఆర్టిస్టు ఇండస్ట్రీకి దూరం అయిపోయాడని, అతడి కెరీర్ ఇలా అర్ధంతరంగా ముగిసిపోవడం బాధాకరమని ఆమె ఆ పోస్టులో వ్యాఖ్యానించడం విశేషం.

మామూలుగా హీరోయిన్లు పెళ్లి చేసుకోగానే వాళ్ల కెరీర్ ముగిసిపోయినట్లు చాలామంది వ్యాఖ్యానిస్తుంటారు. హీరోల విషయంలో మాత్రం ఇలా జరగదు. దీనిపై ఆమె వ్యంగ్యంగా ఈ పోస్టు పెట్టింది. ఒకప్పుడు హీరోయిన్లు చాలామంది పెళ్లి కాగానే సినిమాలకు గుడ్‌బై చెప్పేసేవాళ్లు. కొందరు సినిమాల్లో కొనసాగాలని అనుకున్నా.. పెళ్లయిన హీరోయిన్లకు ఇండస్ట్రీ నుంచి పెద్దగా ప్రోత్సాహం ఉండేది కాదు. ఈ నేపథ్యంలోనే శ్రద్ధ అలాంటి పోస్ట్ పెట్టింది.

కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. పెళ్లయ్యాక కూడా చాలామంది విజయవంతంగా కెరీర్‌లను కొనసాగిస్తున్నారు. కరీనా కపూర్, దీపికా పదుకొనే, శ్రియ, సమంత, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఇందుకు ఉదాహరణ. వీరి స్ఫూర్తితో టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకుంది. ఆమె రాజకీయ నాయకుడైన భవ్య బిష్ణోయ్‌తో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

కెరీర్ బాగా సాగుతున్న సమయంలో, ఈ వయసులో పెళ్లేంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు కానీ.. మెహ్రీన్ మాత్రం వివాహానికి ఇదే సరైన సమయం అనుకుంది. రాజకీయ నాయకుడి కుటుంబంలోకి వెళ్తున్న ఆమె ఇక సినిమాల్లో నటించదేమో అనుకున్నారు. కానీ మెహ్రీన్ మాత్రం ఈ సందేహాలకు తెరదించుతూ.. తాను పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని, అందుకు తన భర్త నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని, వ్యక్తిగత-వృత్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు చేస్తానని స్పష్టం చేసింది. త్వరలోనే భవ్యతో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు రెడీ అవుతున్నట్లు ఆమె వెల్లడించింది.

This post was last modified on March 30, 2021 12:55 pm

Share

Recent Posts

రామాయ‌ణం.. ర‌ణ‌బీర్… ర‌బ్బ‌ర్ చెప్పులు

పురాణ గాథ‌ల‌ను తెర‌కెక్కించేట‌పుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విష‌యం…

53 minutes ago

జ‌గ‌న్ భద్రతపై వైసీపీ నేతల ఆందోళన

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా బుధ‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లిలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి పొగాకు రైతుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. తొలుత…

59 minutes ago

ఆన్ లైన్లో తండ్రి అంత్యక్రియలకు హాజరు

రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…

1 hour ago

దర్శకుడు చనిపోయినా సినిమా బ్రతుకుతోంది

ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…

1 hour ago

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావన

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…

2 hours ago

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…

5 hours ago