మామూలుగా హీరోయిన్ల తొలి సినిమాలు హిట్టయితేనే తర్వాత అవకాశాలు వస్తాయి. కానీ కొంతమంది హీరోయిన్లకు మాత్రం తొలి సినిమా ఫలితం లేకుండా మంచి పేరొస్తుంది. తమ అందంతో, అభినయంతో వాళ్లు తమదైన ముద్ర వేస్తుంటారు. లావణ్య త్రిపాఠి ఆ కోవకే చెందుతుంది. ఈ ఉత్తరాది భామ తెలుగులో చేసిన తొలి సినిమా అందాల రాక్షసి పెద్దగా ఆడలేదు. కానీ ఆ సినిమాలో ఆమె పాత్ర మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యేకమైన ఆమె అందం కుర్రాళ్ల మనసులకు గాయం చేసింది. ఆమెకు అభిమానగణం బాగానే తయారైంది. దీంతో మంచి మంచి అవకాశాలే వచ్చాయి.
దూసుకెళ్తా, సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్ లాంటి విజయాలతో లావణ్య ఒక దశలో ప్రామిసింగ్గా కనిపించింది. కానీ ఆ విజయాలను ఆమె నిలబెట్టుకోలేకపోయింది.
గత కొన్నేళ్లలో అర్జున్ సురవరం మినహాయిస్తే లావణ్యకు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. ఆ సినిమా తర్వాత తన నుంచి వస్తున్న చిత్రాలు నిరాశ పరుస్తూ కెరీర్ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తాజాగా రెండు వారాల వ్యవధిలో ఆమె సినిమాలు రెండు రిలీజయ్యాయి. ఈ సినిమాల మీద లావణ్య చాలా ఆశలే పెట్టుకుంది. కానీ సందీప్ కిషన్తో చేసిన ఎ1 ఎక్స్ప్రెస్ కానీ.. కార్తికేయ సరసన నటించిన చావుకబురు చల్లగా కానీ ఆమెకు ఆశించిన ఫలితాలివ్వలేదు.
ఎ1 ఎక్స్ప్రెస్కు ఆమె గ్లామర్ ప్లస్ కాలేదు. అలాగే చావు కబురు చల్లగాలో డీగ్లామరస్గా కనిపిస్తూ నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేయగా అదీ నిరాశపరిచింది. ఈ రెండు సినిమాల ఫలితాలు లావణ్య భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావమే చూపేలా ఉన్నాయి. ఆమె చేతిలో ప్రస్తుతం సినిమాలే లేవు. పై రెండు సినిమాలు ఆడితే అవకాశాలు వచ్చేవేమో. అవి రెండూ పోవడంతో ఇక ఆమె కెరీర్ ముందుకు సాగడమే కష్టంగా ఉంది.
This post was last modified on March 30, 2021 7:14 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…