సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరేళ్ల ముందే నిర్మాతగా మారాడు. శ్రీమంతుడు సినిమాలో నిర్మాణ భాగస్వామి అయ్యాడు. ఆ తర్వాత బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లోనూ అతడి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ భాగమైంది. ఐతే ఆ సినిమాలకు అతడి బేనర్ సమర్పణకే పరిమితం అయింది. నిజంగా మహేష్ ప్రొడక్షన్లోకి దిగి చేసిందేమీ లేదు. మహేష్ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారుతోందంటే మేజర్ సినిమాతోనే.
ఈ సినిమాకు వేరే రెండు సంస్థలు చేతులు కలుపుతున్నప్పటికీ ప్రధాన నిర్మాత మహేష్ బాబే. ఈ తరహాలో వేరే హీరోలతో చిన్న, మీడియం రేంజిలో మరిన్ని సినిమాలు చేయడానికి మహేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర కాంబినేషన్ కుదిరినట్లు తెలుస్తోంది. మహేష్ ప్రొడక్షన్లో యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
ఛలో, భీష్మ లాంటి సూపర్ హిట్ల తర్వాత వెంకీకి టాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అతను ఏకంగా రామ్ చరణ్ లాంటి బడా స్టార్తో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. మహేష్ బాబుతో సినిమా కోసం కూడా ట్రై చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి నవీన్ పొలిశెట్టితో సినిమాకు పరిమితం కావడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస, జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ టాలెంట్ చూశాక రాబోయే రోజుల్లో అతను పెద్ద రేంజికి వెళ్తాడన్న అంచనాలు ఏర్పడ్డాయి.
వెంకీ అతడిని సరిగ్గా ఉపయోగించుకుని దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్ కొడితే.. కచ్చితంగా తర్వాతి సినిమాకు ఓ పెద్ద హీరోనే దొరుకుతాడు. బహుశా తనతో సినిమా కోసం ప్రయత్నించిన వెంకీకి మహేష్ ఈ రకంగా అవకాశం ఇచ్చి ఉండొచ్చు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on March 28, 2021 10:44 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…