సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరేళ్ల ముందే నిర్మాతగా మారాడు. శ్రీమంతుడు సినిమాలో నిర్మాణ భాగస్వామి అయ్యాడు. ఆ తర్వాత బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లోనూ అతడి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ భాగమైంది. ఐతే ఆ సినిమాలకు అతడి బేనర్ సమర్పణకే పరిమితం అయింది. నిజంగా మహేష్ ప్రొడక్షన్లోకి దిగి చేసిందేమీ లేదు. మహేష్ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారుతోందంటే మేజర్ సినిమాతోనే.
ఈ సినిమాకు వేరే రెండు సంస్థలు చేతులు కలుపుతున్నప్పటికీ ప్రధాన నిర్మాత మహేష్ బాబే. ఈ తరహాలో వేరే హీరోలతో చిన్న, మీడియం రేంజిలో మరిన్ని సినిమాలు చేయడానికి మహేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర కాంబినేషన్ కుదిరినట్లు తెలుస్తోంది. మహేష్ ప్రొడక్షన్లో యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
ఛలో, భీష్మ లాంటి సూపర్ హిట్ల తర్వాత వెంకీకి టాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అతను ఏకంగా రామ్ చరణ్ లాంటి బడా స్టార్తో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. మహేష్ బాబుతో సినిమా కోసం కూడా ట్రై చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి నవీన్ పొలిశెట్టితో సినిమాకు పరిమితం కావడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస, జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ టాలెంట్ చూశాక రాబోయే రోజుల్లో అతను పెద్ద రేంజికి వెళ్తాడన్న అంచనాలు ఏర్పడ్డాయి.
వెంకీ అతడిని సరిగ్గా ఉపయోగించుకుని దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్ కొడితే.. కచ్చితంగా తర్వాతి సినిమాకు ఓ పెద్ద హీరోనే దొరుకుతాడు. బహుశా తనతో సినిమా కోసం ప్రయత్నించిన వెంకీకి మహేష్ ఈ రకంగా అవకాశం ఇచ్చి ఉండొచ్చు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…