సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరేళ్ల ముందే నిర్మాతగా మారాడు. శ్రీమంతుడు సినిమాలో నిర్మాణ భాగస్వామి అయ్యాడు. ఆ తర్వాత బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లోనూ అతడి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ భాగమైంది. ఐతే ఆ సినిమాలకు అతడి బేనర్ సమర్పణకే పరిమితం అయింది. నిజంగా మహేష్ ప్రొడక్షన్లోకి దిగి చేసిందేమీ లేదు. మహేష్ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారుతోందంటే మేజర్ సినిమాతోనే.
ఈ సినిమాకు వేరే రెండు సంస్థలు చేతులు కలుపుతున్నప్పటికీ ప్రధాన నిర్మాత మహేష్ బాబే. ఈ తరహాలో వేరే హీరోలతో చిన్న, మీడియం రేంజిలో మరిన్ని సినిమాలు చేయడానికి మహేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర కాంబినేషన్ కుదిరినట్లు తెలుస్తోంది. మహేష్ ప్రొడక్షన్లో యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
ఛలో, భీష్మ లాంటి సూపర్ హిట్ల తర్వాత వెంకీకి టాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అతను ఏకంగా రామ్ చరణ్ లాంటి బడా స్టార్తో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. మహేష్ బాబుతో సినిమా కోసం కూడా ట్రై చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి నవీన్ పొలిశెట్టితో సినిమాకు పరిమితం కావడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస, జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ టాలెంట్ చూశాక రాబోయే రోజుల్లో అతను పెద్ద రేంజికి వెళ్తాడన్న అంచనాలు ఏర్పడ్డాయి.
వెంకీ అతడిని సరిగ్గా ఉపయోగించుకుని దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్ కొడితే.. కచ్చితంగా తర్వాతి సినిమాకు ఓ పెద్ద హీరోనే దొరుకుతాడు. బహుశా తనతో సినిమా కోసం ప్రయత్నించిన వెంకీకి మహేష్ ఈ రకంగా అవకాశం ఇచ్చి ఉండొచ్చు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on March 28, 2021 10:44 pm
కొత్త ఏడాదిలో రెండో నెల వచ్చేసింది. సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చిన తర్వాత బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సౌండ్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…
తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన…
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…
అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…
భారత్ మరోసారి టీ20 క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో…