టాలీవుడ్లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుపోయే హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అతడికి అవకాశాలు వరుస కడుతుంటాయి. చివరగా సందీప్ నుంచి వచ్చిన ‘ఎ1 ఎక్స్ప్రెస్’ సైతం అంచనాలను అందుకోలేకపోయింది. అయినా అతనేమీ ఆగట్లేదు. ఈ సినిమా రిలీజ్కు ముందే మొదలుపెట్టిన సినిమాను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రానికి ముందు ‘రౌడీ బేబీ’ అనే ఆకర్షణీయమైన టైటిల్ పెట్టుకున్నారు. కానీ ఆ టైటిల్ వేరే నిర్మాత రిజిస్టర్ చేయించడంతో పేరు మార్చుకోక తప్పని పరిస్థితి నెలకొంది. తమ సినిమా పేరు మారనున్నట్లు అధికారికంగానే ప్రకటించిన చిత్ర బృందం.. ఈ రోజు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా కొత్త టైటిల్ లాంచ్ చేయించారు.
‘రౌడీ బేబీ’లోంచి బేబీ తీసేసి.. గల్లీ పదాన్ని చేర్చి ‘గల్లీ రౌడీ’ అనే పేరు ఖరారు చేశారు ఈ చిత్రానికి. మారింది పేరు మాత్రమే అని, మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ కొత్త టైటిల్తో ఒక వీడియోను వదిలారు. ‘రౌడీ బేబీ’ అంత పాపులర్ కాకపోయినా ‘గల్లీ రౌడీ’ అనే టైటిల్ కూడా ఆకర్షణీయమైంది. టైటిల్ను బట్టి సందీప్ ఇందులో ఒక ఛోటా రౌడీ పాత్రలో కనిపించనున్నాడని అర్థమవుతోంది. కోన వెంకట్ సమర్పణలో వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు.
ఈ చిత్రంలో సందీప్ సరసన ‘మెహబూబా’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. తమిళ నటుడు బాబీ సింహా ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇంతకుముందు సందీప్-నాగేశ్వరరెడ్డి కలయికలో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ నిరాశ పరిచింది. మరి ‘గల్లీ రౌడీ’తో అయినా ఈ ఇద్దరూ హిట్ కొడతారేమో చూడాలి.
This post was last modified on March 25, 2021 3:22 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…