2020 వేసవిలో రావాల్సిన సినిమా అరణ్య. ఈ సినిమా అంతకు రెండేళ్ల ముందు మొదలైంది. బాహుబలి-ది కంక్లూజన్ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు రానా దగ్గుబాటి. కానీ అతడి అనారోగ్య సమస్యల వల్ల, అలాగే అటవీ లొకేషన్లలో భారీ స్థాయిలో ఈ సినిమా తీయాల్సి రావడం వల్ల బాగా ఆలస్యం జరిగింది. చివరికి సినిమాను విడుదలకు సిద్ధం చేశాక.. కరోనా వచ్చి బ్రేకులేసింది. ఏడాది పాటు సినిమాను ఆపి ఎట్టకేలకు మార్చి 26న విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు.
తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ విడుదలకు ఇంకో మూడు రోజులే ఉండగా.. నిర్మాతలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంలో భాగస్వామి అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ హిందీ వెర్షన్ విడుదలను వాయిదా వేసేసింది. ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చింది.
హిందీ సినిమాలకు కేంద్ర స్థానం అయిన మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఉత్తరాదిన మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువై అనేక చోట్ల సినిమాల ప్రదర్శన ఆపేస్తున్నారు. లేదా సగం ఆక్యుపెన్సీకి పరిమితం చేస్తున్నారు. జనాలు ఇళ్లు దాటి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హిందీ సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది.
ముంబయి సెగా చిత్రం మంచి టాక్ తెచ్చుకుని కూడా వసూళ్లు రాబట్టలేకపోతోంది. సాధారణ సమయాల్లో వచ్చే వసూళ్లతో పోలిస్తే దీనికి 40 శాతం కలెక్షన్లు మాత్రమే వచ్చాయి వీకెండ్లో. ఈ పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయడం అంటే చేజేతులా చంపుకోవడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకాలం ఆపి, ఇలాంటి స్థితిలో హాథీ మేరీ సాథీని రిస్క్ చేసి రిలీజ్ చేయడం మంచిది కాదని ఈరోస్ సంస్థ నిర్ణయించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో మాత్రం ఈ సినిమా యధావిధిగా రిలీజవుతుందని, హిందీ రిలీజ్ గురించి తర్వాత వెల్లడిస్తామని ఆ సంస్థ పేర్కొంది.
This post was last modified on March 24, 2021 7:23 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…