కార్తీక దీపం.. తెలుగు టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సీరియల్. మా టీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్కు అదిరిపోయే స్థాయిలో వ్యూయర్ షిప్ ఉంది. ఈ సీరియల్ ప్రసార సమయానికి ఇళ్లలో మహిళలు టీవీల ముందు కూలబడిపోతారు. సీరియల్ అయిపోయాక మళ్లీ ఎపిసోడ్ వచ్చే వరకు దీని మీద చర్చలు నడుస్తుంటాయి.
డాక్టర్ బాబు (కార్తీక్), వంటలక్క (దీప) చాలా మంది ఇళ్లలో కుటుంబ సభ్యుల్లా మారిపోయారంటే అతిశయోక్తి కాదు. తన భార్య అయిన వంటలక్కను అపార్థం చేసుకుని ఆమెను దూరం పెడతాడు డాక్టర్ బాబు. వీళ్ల మధ్యలోకి మోనిత అనే మూడో మనిషి వస్తుంది. ఆమె డాక్టర్ బాబుకు దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. చాలా ఏళ్లుగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. కథ కాస్తయినా ముందుకు కదలకుండా స్ట్రక్ అయిపోయినా సరే.. ఈ సీరియల్ అంటే ప్రేక్షకులు పడిచస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ సీరియల్ విషయంలో చాలా ఎమోషనల్ అవుతుంటారు.
ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఈ సీరియల్ మీద బోలెడంత కామెడీ నడుస్తుంటుంది. లాక్ డౌన్ టైంలో ఈ సీరియల్ రాకపోవడంతో టీవీ ప్రేక్షకులు వంటలక్కను ఎంతగా మిస్సవుతుంటారో అంటూ కామెడీ చేస్తున్నారు నెటిజన్లు. వంటలక్క కనిపించడం లేదంటూ మీమ్స్ కూడా వేస్తున్నారు.
‘హిట్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శైలేష్ కొలను కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఈ సీరియల్ మీద కామెడీ చేశాడు. తన తల్లితో కార్తీక దీపం సీరియల్ గురించి చర్చిస్తున్న వీడియోను అతను ఈ రోజు ట్విట్టర్లో షేర్ చేశాడు.
సీరియల్లో డాక్టర్ బాబు దీపను వదిలిపెట్టి చక్కగా మోనితతో సెటిలైపోతే బాగుంటుందని శైలేష్ అంటే.. అతడి తల్లి చాలా సీరియస్ అవుతూ, అదే జరిగితే సీరియల్ డైరెక్టర్ను వెంటాడి కొడతారని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. వీడియో సంగతి ఆమెకు తెలియనట్లే ఉంది. సీరియల్ విషయంలో చాలామంది మహిళల లాగే ఆమె కూడా ఎమోషనల్ అని అర్థమవుతోంది.
This post was last modified on May 10, 2020 3:27 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…