ఈ తరంలో తనను మించిన కథానాయిక ఇండియాలో లేదని కంగనా రనౌత్ మరోసారి చాటి చెప్పింది. ఆమె తన ఖాతాలోకి నాలుగో జాతీయ అవార్డును వేసుకుంది. వ్యక్తిగతంగా కంగనా ఎంతటి వివాదాస్పదురాలో.. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఆమె పొలిటికల్ ప్రాపగండాల్లో భాగంగా మారి సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తోందో తెలిసిందే. కానీ నటిగా మాత్రం కంగనా స్థాయి వేరు. తెరమీద ఆమె పెర్ఫామెన్స్ చూసి ఫిదా అవ్వని వాళ్లు లేరు.
ఇప్పుడు కంగనా మరోసారి జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక కావడానికి మోడీ సర్కారు అండే కారణం అనే వాళ్లూ లేకపోలేదు. కానీ మణికర్ణిక, పంగా సినిమాల్లో కంగనా నటన చూశాక ఆమె ఈ అవార్డుకు అర్హురాలనే అనిపిస్తుంది. నటిగా ఆమె కొత్తగా రుజువు చేసుకోవాల్సిందేమీ కూడా లేదు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాత్రలతో ఆమె సత్తా చాటుకుంది.
ఫ్యాషన్ సినిమాలో నటనకు గాను తొలిసారి కంగనా ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాలు గెలుచుకుంది. ఇప్పుడు నాలుగో అవార్డును సొంతం చేసుకుంది. ఆమె ఇంకొక్క జాతీయ అవార్డు గెలిస్తే.. ఇండియాలో అత్యధిక జాతీయ అవార్డులు సాధించిన నటిగా లెజెండరీ షబానా ఆజ్మీ సరసన చేరుతుంది కంగనా.
షబానా అంకుర్, అర్థ్, కాందార్, పార్, గాడ్ మదర్ సినిమాలకు జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఐదుసార్లూ ఆమె ఉత్తమ నటి పురస్కారాన్నే గెలుచుకుంది. కంగనా మూడుసార్లు ఉత్తమ నటిగా, ఒకసారి ఉత్తమ సహాయ నటిగా అవార్డులు సాధించింది. ఎలా అయితేనేం ఆమె ఖాతాలో నాలుగు పురస్కారాలున్నాయి. ఇంకో అవార్డు సాధిస్తే షబానాను సమం చేసి చరిత్రలో నిలిచిపోతుంది కంగనా. ఆమెకది కష్టం కాకపోవచ్చు.
This post was last modified on March 23, 2021 9:44 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…