చిలసౌ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు వేయించుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ఒక నటుడు దర్శకుడిగా మారి ఇంత మంచి సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేదు. పెద్దగా అంచనాల్లేకుండా ఈ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయే పనితనం చూపించాడు రాహుల్.
ప్రేక్షకుల్లాగే అక్కినేని నాగార్జున సైతం రాహుల్ వర్క్ చూసి ఇంప్రెస్ అయి అతడి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో సినిమా చేశాడు. అదే.. మన్మథుడు-2. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. నాగ్ కెరీర్లో పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆ దెబ్బకు రాహుల్ కెరీర్ కూడా గాడి తప్పింది. ఇప్పటిదాకా దర్శకుడిగా తన మూడో సినిమాను మొదలుపెట్టలేకపోయాడు. ఐతే గీతా ఆర్ట్స్లో అతడి సినిమా ఓకే అయినట్లుగా వార్తలొస్తున్నాయి.
ఈ సంగతలా ఉంచితే.. రాహుల్ తాజాగా తన ట్విట్టర్ ఫాలోవర్లతో చిన్న చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ రాహుల్ తర్వాతి ప్రాజెక్టు గురించి అడుగుతూ నాగార్జున కోసం యాక్షన్ కథ రెడీ చేస్తున్నట్లు అప్పట్లో చెప్పారు కదా, ఆ సినిమా ఎప్పుడు అని అడిగాడు. దీనికి రాహుల్ ఆశ్చర్యకర సమాధానం ఇచ్చాడు.
మన్మథుడు-2 దెబ్బకు నాగ్ అభిమానులు తనను ఇప్పటికీ తిట్టుకుంటున్నారని.. కాబట్టి ఇప్పుడు నాగ్తో సినిమా వద్దులే అనేశాడు రాహుల్. భవిష్యత్తులో కుదిరితే నాగ్తో సినిమా చేస్తానేమో చూడాలని.. అభిమానులను తాను సంతృప్తిపరచగలనని అనుకున్నపుడు అది సాధ్యమవుతుందని.. ప్రస్తుతానికి మాత్రం ఈ విషయంలో నిరాశ పరుస్తున్నందుకు క్షమించాలని ఆ నెటిజన్కు బదులిచ్చాడు రాహుల్. మన్మథుడు-2 దెబ్బకు తాను డిప్రెషన్లోకి వెళ్లానని గతంలో చెప్పాడు రాహుల్. ఆ సినిమా అతణ్ని ఎంతగా నిరాశపరిచిందనడానికి తాజా వ్యాఖ్యలే ఉదాహరణ.
This post was last modified on March 22, 2021 7:19 am
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…