చిలసౌ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు వేయించుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ఒక నటుడు దర్శకుడిగా మారి ఇంత మంచి సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేదు. పెద్దగా అంచనాల్లేకుండా ఈ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయే పనితనం చూపించాడు రాహుల్.
ప్రేక్షకుల్లాగే అక్కినేని నాగార్జున సైతం రాహుల్ వర్క్ చూసి ఇంప్రెస్ అయి అతడి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో సినిమా చేశాడు. అదే.. మన్మథుడు-2. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. నాగ్ కెరీర్లో పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆ దెబ్బకు రాహుల్ కెరీర్ కూడా గాడి తప్పింది. ఇప్పటిదాకా దర్శకుడిగా తన మూడో సినిమాను మొదలుపెట్టలేకపోయాడు. ఐతే గీతా ఆర్ట్స్లో అతడి సినిమా ఓకే అయినట్లుగా వార్తలొస్తున్నాయి.
ఈ సంగతలా ఉంచితే.. రాహుల్ తాజాగా తన ట్విట్టర్ ఫాలోవర్లతో చిన్న చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ రాహుల్ తర్వాతి ప్రాజెక్టు గురించి అడుగుతూ నాగార్జున కోసం యాక్షన్ కథ రెడీ చేస్తున్నట్లు అప్పట్లో చెప్పారు కదా, ఆ సినిమా ఎప్పుడు అని అడిగాడు. దీనికి రాహుల్ ఆశ్చర్యకర సమాధానం ఇచ్చాడు.
మన్మథుడు-2 దెబ్బకు నాగ్ అభిమానులు తనను ఇప్పటికీ తిట్టుకుంటున్నారని.. కాబట్టి ఇప్పుడు నాగ్తో సినిమా వద్దులే అనేశాడు రాహుల్. భవిష్యత్తులో కుదిరితే నాగ్తో సినిమా చేస్తానేమో చూడాలని.. అభిమానులను తాను సంతృప్తిపరచగలనని అనుకున్నపుడు అది సాధ్యమవుతుందని.. ప్రస్తుతానికి మాత్రం ఈ విషయంలో నిరాశ పరుస్తున్నందుకు క్షమించాలని ఆ నెటిజన్కు బదులిచ్చాడు రాహుల్. మన్మథుడు-2 దెబ్బకు తాను డిప్రెషన్లోకి వెళ్లానని గతంలో చెప్పాడు రాహుల్. ఆ సినిమా అతణ్ని ఎంతగా నిరాశపరిచిందనడానికి తాజా వ్యాఖ్యలే ఉదాహరణ.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…