Movie News

ముంచుపై గుమ్మ‌కొండ ఆధిప‌త్యం

18 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాడు మంచు విష్ణు. కెరీర్ ఆరంభంలో స్ట్ర‌గులైనా.. ఢీతో ప‌ట్టాలెక్కిన‌ట్లే క‌నిపించాడు. కానీ త‌ర్వాత మ‌ళ్లీ ఇబ్బందులు త‌ప్ప‌లేదు. మ‌ధ్య‌లో దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాల‌తో మ‌ళ్లీ ఫామ్ అందుకున్న‌ట్లే క‌నిపించాడు. కానీ ఆ ఊపును కొన‌సాగించ‌డంలో మ‌ళ్లీ విఫ‌ల‌మ‌య్యాడు. గ‌త కొన్నేళ్ల‌లో విష్ణు సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లే అయ్యాయి.

ఒక ద‌శ‌లో అత‌డి సినిమాల ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి స‌న్న‌గిల్లిపోయింది. కానీ ఇప్పుడు అత‌ణ్నుంచి వ‌స్తున్న మోస‌గాళ్ళు కొంత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దీని ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా అనిపించింది. ర‌స‌వ‌త్త‌ర‌మైన థ్రిల్ల‌ర్ చూడ‌బోతున్న ఫీలింగ్ క‌లిగించింది. కానీ విష్ణు గ‌త సినిమాల ప్ర‌భావం వ‌ల్లో ఏమో మోస‌గాళ్ళుకు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో క‌నిపించ‌డం లేదు.

ఈ శుక్ర‌వారం మోస‌గాళ్ళుతో పాటు కార్తికేయ గుమ్మ‌కొండ హీరోగా న‌టించిన చావు క‌బురు చ‌ల్ల‌గా, ఆది సాయికుమార్ మూవీ శ‌శి కూడా విడుద‌ల‌వుతునాయి. ఈ మూడింట్లోకి అడ్వాన్స్ బుకింగ్స్ విష‌యంలో చావు క‌బురు చ‌ల్ల‌గానే పైచేయి సాధిస్తోంది. అల్లు అర‌వింద్ ప్రొడ్యూస్ చేసిన సినిమా కావ‌డంతో దీనికి థియేట‌ర్లు కూడా ఎక్కువ సంఖ్య‌లో దొరికాయి.

శ‌వాల వ్యాన్ డ్రైవ‌ర్ అయిన కుర్రాడు.. త‌న భ‌ర్త చ‌నిపోయిన శోకంలో ఉన్న అమ్మాయిని ప్రేమించ‌డం అనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల దృష్టిని బాగానే ఆక‌ర్షిస్తున్న‌ట్లుంది. దీని ప్రోమోల‌న్నీ బాగా ఆక‌ట్టుకున్నాయి. సినిమా ప్రామిసింగ్‌గా క‌నిపిస్తోంది. మోస‌గాళ్ళు కూడా ట్రైల‌ర్‌తో ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ.. బ‌జ్ మాత్రం కార్తికేయ చిత్రానికే ఎక్కువ క‌నిపిస్తోంది. శ‌శి ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఏమంత ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. దాని రిలీజ్ కూడా త‌క్కువ థియేట‌ర్ల‌లోనే చేస్తున్నారు. మ‌రి ఈ మూడు చిత్రాల్లో దేనికి ఎలాంటి టాక్ వ‌స్తుందో.. ఏది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పైచేయి సాధిస్తుందో చూడాలి.

This post was last modified on March 17, 2021 7:03 pm

Share
Show comments

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

5 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

6 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

6 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

7 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

9 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

11 hours ago