ప్రస్తుతం టాలీవుడ్ స్టార్లందరి దృష్టినీ ఆకర్షిస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇండియాలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఆ హీరోలందరికీ తమ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రశాంత్తో సినిమా చేయాలని ఉంది. ‘కేజీఎఫ్’ చూశాక ఏ మాస్ హీరోకైనా ప్రశాంత్తో సినిమా చేయాలన్న కోరిక పుట్టకుండా ఎలా ఉంటుంది మరి.
అతడికి తన సొంత పరిశ్రమ నుంచే కాక వివిధ ఇండస్ట్రీల నుంచి మంచి ఆఫర్లు ఉన్నప్పటికీ.. టాలీవుడ్ మీదే ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్తో ‘సలార్’ మొదలుపెట్టేశాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు మరో టాలీవుడ్ టాప్ స్టార్తో ప్రశాంత్ సినిమా ఖరారైనట్లే కనిపిస్తోంది. బన్నీ వాసు మాటల ప్రకారం చూస్తే.. అల్లు అర్జున్తోనూ ప్రశాంత్ కచ్చితంగా ఓ సినిమా చేయబోతున్నట్లే.
తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘చావు కబురు చల్లగా’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన బన్నీ వాసు.. బన్నీ-ప్రశాంత్ కాంబినేషన్ గురించి మాట్లాడాడు. ‘‘ప్రశాంత్ నీల్కు, అల్లు అరవింద్ గారికి మంచి రిలేషన్ ఉంది. మా గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. అది బన్నీతో అయితే బావుంటుందని ఆయనకూ, మాకూ ఉంది. కొన్ని పాయింట్లు చర్చల దశలో ఉన్నాయి. ఎప్పుడు ఉంటుందో చెప్పలేం. కానీ, బన్నీ-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తప్పకుండా సినిమా ఉంటుంది’’ అని బన్నీ వాసు క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవలే ప్రశాంత్.. గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వచ్చి అరవింద్తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. బన్నీ వాసు ఇంత ధీమాగా చెబుతున్నాడంటే.. సలార్, ఎన్టీఆర్ సినిమా అయ్యాక ప్రశాంత్.. బన్నీతో జత కట్టడం లాంఛనమే కావచ్చు. ఈలోపు బన్నీ ‘పుష్ప’తో పాటు కొరటాల శివ చిత్రాన్ని పూర్తి చేస్తాడు.
This post was last modified on March 17, 2021 3:36 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…