మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలో సూపర్ హిట్టయిన ‘నా పేరే కాంచనమాల’ పాటలో నటించిన అమ్మాయి గుర్తుందా? బాలీవుడ్కు చెందిన ఈ భామ పేరు గౌహర్ ఖాన్. ఇప్పుడీ అమ్మాయి వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. గౌహర్ కరోనా పాజిటివ్గా తేలినప్పటికీ షూటింగ్లో పాల్గొందంటూ ఆమెపై ముంబయి పోలీసులు కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ విషయమై మీడియాకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు.
‘‘కరోనా సోకిన వ్యక్తి పాటించాల్సిన మార్గనిర్దేశకాలను గౌహర్ ఖాన్ పాటించలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మాకు ముంబయి సిటీ క్షేమం ప్రధానం. నిబంధనలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి. అందుకే గౌహర్ ఖాన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. కరోనా విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని ఆ ప్రెస్ నోట్లో ముంబయి పోలీసులు పేర్కొన్నారు.
కరోనా ఉన్నా కూడా గౌహర్ ఖాన్ ఎలా షూటింగ్లో పాల్గొందంటూ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. సహచరుల ప్రాణాలు రిస్క్లో పెట్టడం సమంజసమేనా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఆమె నటిస్తున్న సినిమాకు సంబంధించిన యూనిట్ మాత్రం పోలీసుల ఆరోపణలను ఖండించింది.
గౌహర్ ఖాన్కు కరోనా నెగెటివ్ వచ్చాకే షూటింగ్లో పాల్గొన్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. గౌహర్ తీవ్ర మానసిక వేదనలో ఉన్నట్లు పేర్కొంది. పది రోజుల కిందటే గౌహర్ తండ్రి చనిపోయారని.. దానికి సంబంధించిన విషాదంలో ఉండగా ఈ ఆరోపణలు ఆమెను మరింత కుంగదీస్తున్నాయని చిత్ర బృందం వివరించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే గౌహర్ నడుచుకుంటోందని.. ఆమెపై అనవసర అభాండాలు వేయొద్దని చిత్ర యూనిట్ కోరింది. ఐతే దీనిపై గౌహర్ మాత్రం ఏమీ స్పందించట్లేదు. ఆమె వివరణ కోసం మీడియా వాళ్లు ప్రయత్నించినా స్పందించలేదు.
This post was last modified on March 16, 2021 4:31 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…