ఫ్లాప్ సినిమాలతో కూడా గౌరవం సంపాదించుకున్న దర్శకుడంటూ ఓ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్.. సుకుమార్ను పొగిడిన విషయం జనాలకు గుర్తుండే ఉంటుంది. ఆయన కెరీర్లో పెద్ద డిజాస్టర్లుగా నిలిచిన 1 నేనొక్కడినే, జగడం సినిమాలు కూడా కల్ట్ స్టేటస్ అందుకోవడం అందుకు నిదర్శనం.
ఆర్య లాంటి బ్లాక్బస్టర్తో దర్శకుడిగా పరిచయమైన సుక్కు.. రెండో ప్రయత్నంలో చేసిన జగడం బాక్సాఫీస్ దగ్గర నిరాశాజనక ఫలితాన్నందుకుంది. కానీ ఆ సినిమా నచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. టీవీలోనో, యూట్యూబ్లోనూ ఈ సినిమా చూసి ఏం తీశాడని పొగిడేవాళ్లకు లెక్క లేదు. ఈ చిత్రం విడుదలై 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుకుమార్ నోస్టాల్జిక్ ఫీలింగ్లోకి వెళ్లిపోయాడు. ఎంతో ప్రేమతో తాను జగడం సినిమా తీసినట్లు గుర్తు చేసుకున్నాడు. కుదిరితే అదే సినిమాను ఇప్పుడు రామ్తో రీమేక్ చేయాలని ఉందని సుక్కు చెప్పడం విశేషం.
జగడం చేసే సమయానికి రామ్ 17 ఏళ్ల కుర్రాడని.. కానీ ఆ వయసులో తాను ఏ ఎక్స్ప్రెషన్ అడిగితే అది ఇచ్చాడని.. తెలియని పని చెప్పినా పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి చేసేసేవాడని సుక్కు తెలిపాడు. రామ్ను ఆ సినిమా టైంలో చూసినపుడే పెద్ద స్థాయికి వెళ్తాడనుకున్నానని, అతడి ఎనర్జీనే ఇప్పుడు తాను ఉన్న స్థాయికి కారణమని సుక్కు అన్నాడు. కుదిరితే ఇప్పటి రామ్ను పెట్టి జగడం సినిమాను మళ్లీ తీయాలని అనిపిస్తోందని సుక్కు చెప్పాడు.
జగడం సినిమాకు రావాల్సినంత అప్రిసియేషన్ రాలేదని అనుకునేవాడినని.. కానీ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీకర్ ప్రసాద్ ఓ సందర్భంలో తనను కలిసినపుడు ముంబయిలో ఎంతోమంది టెక్నీషియన్లు తమ లైబ్రరీలో ఈ సినిమాను పెట్టుకున్నారని, రెఫరెన్స్ లాగా వాడుతున్నారని చెప్పి తనను ఆశ్చర్యపరిచినట్లు సుక్కు వెల్లడించాడు. ఈ సినిమాకు రత్నవేలు అందించిన ఇండియాలోనే ది బెస్ట్ ఫొటోగ్రఫీ వర్క్ల్లో ఒకటని సుక్కు తెలిపాడు.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…