కరోనా వైరస్ ప్రభావంతో కుదేలవుతున్న రంగాల్లో సినీ రంగం కూడా ఒకటి. ఫిబ్రవరి-మార్చి మధ్య అన్ సీజన్లో అప్పటికే వసూళ్లు బాగా పడిపోయి స్లంప్ నడుస్తున్న సమయంలో కరోనా వచ్చి పూర్తిగా థియేటర్లకు తెరదించేసింది. షూటింగులు ఆపించేసింది. దీంతో రెండు నెలలకు పైగా సినీ రంగం ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటోంది.
మళ్లీ మామూలు పరిస్థితులు ఎప్పుడొస్తాయో.. సినీ కార్యకలాపాలన్నీ ఎప్పుడు మొదలవుతాయో.. థియేటర్లలో సినిమాల ప్రదర్శన ఎప్పటికి ఆరంభమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 14 వరకు ఉన్న లాక్ డౌన్ను నెలాఖరు వరకు కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తేసినా.. వెంటనే థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు అనుమతులిస్తారో లేదో తెలియదు.
ఒకవేళ అనుమతులిచ్చినా.. కొంత కాలం పాటు మునుపటిలా అయితే సినిమాల ప్రదర్శన ఉండదన్నది స్పష్టం. థియేటర్లలో ఒక సీటు తర్వాత ఒక సీటు ఖాళీ వదలడం తప్పేలా లేదు. అలాగే థియేటర్లలో శానిటైజేషన్ కోసం.. సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, ప్రేక్షకులకు పరీక్షలు చేయడానికి థర్మామీటర్ల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత చేసినా జనాలు వెంటనే థియేటర్లకు రావడం కష్టమే.
మొత్తంగా చూస్తే మామూలు రోజుల్లో వచ్చే రెవెన్యూతో పోలిస్తే సగం వస్తే ఎక్కువ. కాబట్టి థియేటర్లు తెరుచుకున్నాక తొలి రెండు నెలల్లో సినిమాలకు కష్ట కాలం అన్నట్లే. ఈ సమయంలో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారో చూడాలి.
లాక్ డౌన్ సమయానికి నాని మూవీ వితో ఉప్పెన, అరణ్య, రెడ్ లాంటి సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ అన్నట్లున్నాయి. కానీ లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్లు తెరుచుకున్నా రెవెన్యూ బాగా తక్కువ వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఈ సినిమాల్ని రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతారా అన్నది సందేహమే.
This post was last modified on April 9, 2020 6:32 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…