నెలన్నర కిందటే ఒక క్రేజీ రూమర్ టాలీవుడ్లో హల్చల్ చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమాలో మన యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఆమిర్ ప్రస్తుతం చేస్తున్న లాల్ సింగ్ చద్దాలో ఓ ముఖ్య పాత్ర ఉందని.. దానికి చైతూను అడుగుతున్నారని ప్రచారం సాగింది. రెండు మూడు రోజుల ప్రచారం తర్వాత దాని గురించి చర్చలు ఆగిపోయాయి. దాన్ని జస్ట్ రూమర్ లాగే ట్రీట్ చేశారు అందరూ.
కానీ తాజా సమాచారం ప్రకారం చైతూ నిజంగానే ఆమిర్ సినిమాలో నటించబోతున్నాడట. ఈ సినిమా కోసం మేలో డేట్లు కూడా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వార్త నిజమే అయితే.. అక్కినేని అభిమానులకు అంతకంటే సంతోషకరమైన విషయం ఉండదు.
లాల్ సింగ్ చద్దాలో ఒక పాత్ర కోసం సౌత్ ఇండియా నటుడినే తీసుకోవాలని ఆమిర్ అండ్ కో బలంగా నిర్ణయించుకున్నారు. ముందు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి ఓకే అయ్యాడు. కానీ ఏవో కారణాలతో అతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పట్నుంచి రకరకాల పేర్లు పరిశీలించి నాగచైతన్యకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సేతుపతి చేయాల్సిన పాత్రకు చైతూ ఏంటి అన్న సందేహం కలగడం సహజం. మరి అతణ్నే ఎందుకు ఎంచుకున్నారో ఏమిటో.
చైతూ తండ్రి నాగార్జున బాలీవుడ్లో బాగానే ఫేమస్. ఆయన 90ల్లోనే బాలీవుడ్ సినిమాల్లో మెరిశాడు. ఇప్పుడు కూడా బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రంలో నటిస్తున్నాడు. తండ్రి బాటలో చైతూ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. అది కూడా ఆమిర్ ఖాన్ సినిమాతో అది జరిగితే అక్కినేని అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్కు రీమేక్గా తెరకెక్కతున్న లాల్ సింగ్ చద్దాలో ఆమిర్.. సిక్కు వ్యక్తిగా కనిపించనున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on March 15, 2021 8:46 am
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక…