నెలన్నర కిందటే ఒక క్రేజీ రూమర్ టాలీవుడ్లో హల్చల్ చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమాలో మన యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఆమిర్ ప్రస్తుతం చేస్తున్న లాల్ సింగ్ చద్దాలో ఓ ముఖ్య పాత్ర ఉందని.. దానికి చైతూను అడుగుతున్నారని ప్రచారం సాగింది. రెండు మూడు రోజుల ప్రచారం తర్వాత దాని గురించి చర్చలు ఆగిపోయాయి. దాన్ని జస్ట్ రూమర్ లాగే ట్రీట్ చేశారు అందరూ.
కానీ తాజా సమాచారం ప్రకారం చైతూ నిజంగానే ఆమిర్ సినిమాలో నటించబోతున్నాడట. ఈ సినిమా కోసం మేలో డేట్లు కూడా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వార్త నిజమే అయితే.. అక్కినేని అభిమానులకు అంతకంటే సంతోషకరమైన విషయం ఉండదు.
లాల్ సింగ్ చద్దాలో ఒక పాత్ర కోసం సౌత్ ఇండియా నటుడినే తీసుకోవాలని ఆమిర్ అండ్ కో బలంగా నిర్ణయించుకున్నారు. ముందు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి ఓకే అయ్యాడు. కానీ ఏవో కారణాలతో అతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పట్నుంచి రకరకాల పేర్లు పరిశీలించి నాగచైతన్యకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సేతుపతి చేయాల్సిన పాత్రకు చైతూ ఏంటి అన్న సందేహం కలగడం సహజం. మరి అతణ్నే ఎందుకు ఎంచుకున్నారో ఏమిటో.
చైతూ తండ్రి నాగార్జున బాలీవుడ్లో బాగానే ఫేమస్. ఆయన 90ల్లోనే బాలీవుడ్ సినిమాల్లో మెరిశాడు. ఇప్పుడు కూడా బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రంలో నటిస్తున్నాడు. తండ్రి బాటలో చైతూ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. అది కూడా ఆమిర్ ఖాన్ సినిమాతో అది జరిగితే అక్కినేని అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్కు రీమేక్గా తెరకెక్కతున్న లాల్ సింగ్ చద్దాలో ఆమిర్.. సిక్కు వ్యక్తిగా కనిపించనున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on March 15, 2021 8:46 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…