నెలన్నర కిందటే ఒక క్రేజీ రూమర్ టాలీవుడ్లో హల్చల్ చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమాలో మన యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఆమిర్ ప్రస్తుతం చేస్తున్న లాల్ సింగ్ చద్దాలో ఓ ముఖ్య పాత్ర ఉందని.. దానికి చైతూను అడుగుతున్నారని ప్రచారం సాగింది. రెండు మూడు రోజుల ప్రచారం తర్వాత దాని గురించి చర్చలు ఆగిపోయాయి. దాన్ని జస్ట్ రూమర్ లాగే ట్రీట్ చేశారు అందరూ.
కానీ తాజా సమాచారం ప్రకారం చైతూ నిజంగానే ఆమిర్ సినిమాలో నటించబోతున్నాడట. ఈ సినిమా కోసం మేలో డేట్లు కూడా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వార్త నిజమే అయితే.. అక్కినేని అభిమానులకు అంతకంటే సంతోషకరమైన విషయం ఉండదు.
లాల్ సింగ్ చద్దాలో ఒక పాత్ర కోసం సౌత్ ఇండియా నటుడినే తీసుకోవాలని ఆమిర్ అండ్ కో బలంగా నిర్ణయించుకున్నారు. ముందు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి ఓకే అయ్యాడు. కానీ ఏవో కారణాలతో అతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పట్నుంచి రకరకాల పేర్లు పరిశీలించి నాగచైతన్యకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సేతుపతి చేయాల్సిన పాత్రకు చైతూ ఏంటి అన్న సందేహం కలగడం సహజం. మరి అతణ్నే ఎందుకు ఎంచుకున్నారో ఏమిటో.
చైతూ తండ్రి నాగార్జున బాలీవుడ్లో బాగానే ఫేమస్. ఆయన 90ల్లోనే బాలీవుడ్ సినిమాల్లో మెరిశాడు. ఇప్పుడు కూడా బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రంలో నటిస్తున్నాడు. తండ్రి బాటలో చైతూ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. అది కూడా ఆమిర్ ఖాన్ సినిమాతో అది జరిగితే అక్కినేని అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్కు రీమేక్గా తెరకెక్కతున్న లాల్ సింగ్ చద్దాలో ఆమిర్.. సిక్కు వ్యక్తిగా కనిపించనున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on March 15, 2021 8:46 am
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…