నెలన్నర కిందటే ఒక క్రేజీ రూమర్ టాలీవుడ్లో హల్చల్ చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమాలో మన యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఆమిర్ ప్రస్తుతం చేస్తున్న లాల్ సింగ్ చద్దాలో ఓ ముఖ్య పాత్ర ఉందని.. దానికి చైతూను అడుగుతున్నారని ప్రచారం సాగింది. రెండు మూడు రోజుల ప్రచారం తర్వాత దాని గురించి చర్చలు ఆగిపోయాయి. దాన్ని జస్ట్ రూమర్ లాగే ట్రీట్ చేశారు అందరూ.
కానీ తాజా సమాచారం ప్రకారం చైతూ నిజంగానే ఆమిర్ సినిమాలో నటించబోతున్నాడట. ఈ సినిమా కోసం మేలో డేట్లు కూడా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వార్త నిజమే అయితే.. అక్కినేని అభిమానులకు అంతకంటే సంతోషకరమైన విషయం ఉండదు.
లాల్ సింగ్ చద్దాలో ఒక పాత్ర కోసం సౌత్ ఇండియా నటుడినే తీసుకోవాలని ఆమిర్ అండ్ కో బలంగా నిర్ణయించుకున్నారు. ముందు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి ఓకే అయ్యాడు. కానీ ఏవో కారణాలతో అతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పట్నుంచి రకరకాల పేర్లు పరిశీలించి నాగచైతన్యకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సేతుపతి చేయాల్సిన పాత్రకు చైతూ ఏంటి అన్న సందేహం కలగడం సహజం. మరి అతణ్నే ఎందుకు ఎంచుకున్నారో ఏమిటో.
చైతూ తండ్రి నాగార్జున బాలీవుడ్లో బాగానే ఫేమస్. ఆయన 90ల్లోనే బాలీవుడ్ సినిమాల్లో మెరిశాడు. ఇప్పుడు కూడా బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రంలో నటిస్తున్నాడు. తండ్రి బాటలో చైతూ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. అది కూడా ఆమిర్ ఖాన్ సినిమాతో అది జరిగితే అక్కినేని అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్కు రీమేక్గా తెరకెక్కతున్న లాల్ సింగ్ చద్దాలో ఆమిర్.. సిక్కు వ్యక్తిగా కనిపించనున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on March 15, 2021 8:46 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…