Movie News

‘దృశ్యం-2’ చూసి రాజమౌళి ఫ్లాట్

ఈ మధ్య కాలంలో భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన సినిమా అంటే ‘దృశ్యం-2’నే. ఇది మలయాళం సినిమానే అయినా.. అమేజాన్ ప్రైమ్‌లో సబ్‌టైటిల్స్ పెట్టుకుని వివిధ భాషల వాళ్లు విరగబడి చూశారు. అందుక్కారణం.. ఇది ఆరేళ్ల కిందట వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘దృశ్యం’కు సీక్వెల్ కావడం, తొలి భాగానికి ఏమాత్రం తగ్గని విధంగా ఉత్కంఠభరితంగా సాగడమే.

నిజానికి ఈ సినిమాపై జనాల్లో పెద్దగా అంచనాలు లేవు. ‘దృశ్యం’కు సీక్వెల్ అంటూ క్యాష్ చేసుకునే ప్రయత్నం లాగే కనిపించింది చాలామందికి. కానీ ప్రేక్షకులకు షాకుల మీద షాకులిస్తూ.. ఎంతో ఉత్కంఠభరితంగా, పకడ్బందీగా కథను నడిపిస్తూ గొప్ప అనుభూతిని పంచాడు దర్శకుడు జీతు జోసెఫ్. ఇప్పుడీ సినిమాకు తెలుగులో రీమేక్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వేరే భాషల్లోనూ ఇది రీమేక్ అయ్యే అవకాశాలున్నాయి. తాజాగా మన దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ సినిమా చూశాడు.

‘దృశ్యం-2’ చూసి మెస్మరైజ్ అయిపోయిన రాజమౌళి.. దర్శకుడు జీతు జోసెఫ్ నంబర్ తీసుకుని ఆయన్ని పొగుడుతూ పర్సనల్ మెసేజ్ పెట్టాడు. జీతు ఆ మెసేజ్‌ను మీడియాతో పంచుకున్నాడు. ‘‘హాయ్ జీతు. నేను సినీ దర్శకుడు రాజమౌళిని. కొన్ని రోజుల కిందట ‘దృశ్యం-2’ చూశా. అప్పట్నుంచి అది నన్ను వెంటాడుతోంది. వెంటనే మళ్లీ దృశ్యం ఫస్ట్ పార్ట్ చూశా. ఇంతకుముందు నేను తెలుగు దృశ్యం రిలీజైనపుడు చూశా. దర్శకత్వం, స్క్రీన్ ప్లే, నటన.. అన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పగలను. కానీ అన్నింటికీ మించి రైటింగ్ మరో స్థాయిలో ఉంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తగ్గనట్లు ఉంది. దృశ్యం ఫస్ట్ పార్ట్ ఒక మాస్టర్ పీస్ అయితే.. రెండో భాగాన్ని అంతే పకడ్బందీ కథతో తీర్చిదిద్దడం.. అంతే బిగువుతో కథనం ఉండటం అద్భుతమైన విషయం. ఇలాంటి మరెన్నో మాస్టర్ పీస్‌లు మీ నుంచి రావాలని కోరుకుంటున్నా’’ అని రాజమౌళి ఈ మెసేజ్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇండియాలోనే నంబర్ వన్ దర్శకుడిగా పేరున్న రాజమౌళి నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో జీతు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లే ఉన్నాడు.

This post was last modified on March 14, 2021 3:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

6 hours ago