Movie News

రాజకీయారంగేట్రంపై తారక్‌ లేటెస్ట్ కామెంట్

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి చర్చ ఈనాటిది కాదు. పాతికేళ్ల వయసున్నపుడే.. 2009 ఎన్నికల్లో అతను తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశాడు. ఐతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడంతో తారక్ రాజకీయాలకు దూరం అయిపోయాడు. తర్వాత ఎప్పుడూ ఇటువైపు చూడలేదు. అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

ఐతే తారక్‌కు పార్టీ నుంచి అయితే ఆహ్వానం వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. మరి తారక్‌కు రాజకీయాల్లోకి రావడంపై మనసులో ఏముందో జనాలకు తెలియట్లేదు. ఈ విషయంపై ఎప్పుడు ప్రశ్నించినా.. తారక్ సమాధానం దాటవేస్తూనే ఉన్నాడు. తాజాగా అతను హోస్ట్ చేయబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి సంబంధించి ప్రెస్ మీట్ జరిగింది. అందులోనూ తారక్‌కు రాజకీయారంగేట్రంపై ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు తారక్ సమాధానం ఇస్తూ.. ‘‘ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో మీకు బాగా తెలుసు. ‘ఇది సమయం కాదు. సందర్భమూ కాదు’. తర్వాత మనం కాఫీ తాగుతూ తీరిగ్గా ఆ విషయం గురించి కబుర్లు చెప్పుకుందాం’’ అని చెప్పాడు. ఐతే మరి తారక్ అలా కాఫీ తాగుతూ మీడియా వారితో పొలిటికల్ కబుర్లు చెప్పుకునే రోజు ఎప్పుడొస్తుందన్నదే ప్రశ్నార్థకం.

‘ఆర్ఆర్ఆర్’ కోసం దాదాపు మూడేళ్లు తీసుకోవడంపై తారక్ స్పందిస్తూ.. ఆ సినిమా అంత డిమాండ్ చేయడం వల్ల సమయం వెచ్చించాల్సి వస్తోందన్నాడు. అలాంటి గొప్ప ప్రాజెక్టులో భాగమైనందుకు గర్విస్తున్నానని.. మన హీరోలకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చే సినిమా ఇదవుతుందని తారక్ అన్నాడు. ఈ మూడేళ్లలో షూటింగ్‌ విరామాల్లో తన ఇద్దరు పిల్లల కోసం చాలా సమయం కేటాయించానని, అది తనకెంతో ఆనందాన్నిచ్చే విషయమని, అంతకుమించి తాను కోరుకునేదేమీ ఉండదని తారక్ చెప్పాడు.

This post was last modified on March 13, 2021 7:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

12 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

14 hours ago