జనాలు ఎవరిని ఎప్పుడు హీరోల్ని చేస్తారు.. ఎప్పుడు జీరోల్ని చేస్తారో అర్థం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా కాలంలో ఏదైనా సరరే చాలా వేగంగా జరిగిపోతుంటుంది. గత ఏడాది కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకోవడంతో సోనూ సూద్ ఎలా హీరోగా మారాడో తెలిసిందే. రాజకీయ నాయకులు, సినీ హీరోలను మించి అతను ఇమేజ్ సంపాదించుకున్నాడు. రియల్ హీరో అనిపించుకున్నాడు. అతడికి జనం దేశవ్యాప్తంగా బ్రహ్మరథం పట్టారు. సోషల్ మీడియాలోనే కాదు.. బయట కూడా అతడికి భారీగా అభిమాన గణం తయారైంది. అతను కూడా తట్టుకోలేని స్థాయిలో ప్రేమను కురిపించారు. సోషల్ మీడియాలో అయితే సోనూ సూద్కు ఏ స్థాయిలో ఎలివేషన్లు ఇస్తుంటారో తెలిసిందే. ఐతే ఇన్నాళ్లూ హీరోగా ఉన్న సోనూ.. ఇప్పుడు ఉన్నట్లుండి విలన్ అయిపోయాడు నెటిజన్ల దృష్టిలో.
#WhoTheHellAreUSonuSood.. ట్విట్టర్లో గురువారం ఉదయం నుంచి ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. రాత్రి అయితే ఇండియా లెవెల్లో టాప్లో ట్రెండ్ అయింది. ఉన్నట్లుండి సోనూ మీద ఇలాంటి నెగెటివ్ ట్యాగ్ వేయడానికి కారణం లేకపోలేదు. అతను మహాశివరాత్రి సందర్భంగా ఒక ట్వీట్ వేశాడు. కేవలం ఒక ఫొటో పెట్టి విష్ చెప్పడం కాకుండా ఎవరికైనా సాయం చేస్తేనే నిజమైన మహా శివరాత్రి అని అతను పేర్కొన్నాడు. ఈ ట్వీట్ నెటిజన్లకు నచ్చలేదు. హిందువుల పండక్కి మాత్రమే సెలబ్రెటీలు ఇలా నీతులు బోధిస్తారని.. మిగతా మతాల పండుగల విషయంలో ఏ కామెంట్ చేయరని అంటూ అతడి మీద విరుచుకుపడ్డారు. పైన పేర్కొన్న హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడిని విపరీతంగా ట్రోల్ చేశారు. జనాల నుంచి ఇలాంటి స్పందనను సోనూ ఊహించలేదు.
దీపావళి టైంలో కూడా సెలబ్రెటీలు టపాసులు కాల్చొద్దని, కాలుష్యానికి కారకులు కావొద్దని ట్వీట్లు వేసి నెటిజన్ల వ్యతిరేకత ఎదుర్కోవడం తెలిసిందే. హిందువుల పండుగలకే ఇలా సెలబ్రెటీలు నీతులు బోధిస్తారంటూ నెటిజన్లు వారిని తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే సోనూకు కూడా సోషల్ మీడియా సెగ తగిలింది.
This post was last modified on March 12, 2021 3:00 pm
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…