టాలీవుడ్కు ఈసారి వేసవి కాస్త ముందే వచ్చింది. మామూలుగా మార్చి నెలాఖర్లో వచ్చే క్రేజీ మూవీస్తో వేసవి సందడి మొదలవుతుంది. కానీ ఈసారి మాత్రం మార్చి రెండో వారంలోనే బాక్సాఫీస్ దగ్గర హంగామా కనిపిస్తోంది. కరోనా కారణంగా గత ఏడాది చాలా కాలం థియేటర్లు మూతపడటంతో కొత్త ఏడాదిలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు.
దీంతో అన్ సీజన్లోనూ సినిమాలు పెద్ద ఎత్తున వరుస కడుతున్నాయి. మంచి సినిమాలకు వసూళ్ల మోతా మోగుతోంది. ఈ ఆశతోనే ఈ వారం మూడు పేరున్న సినిమాలను విడుదల చేస్తున్నారు. ఆ మూడూ ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమాలే. విభిన్నమైన కథలతో తెరకెక్కినవే. మూడు చిత్రాల మీదా మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ వారం రానున్న మూడు చిత్రాల్లో ముందు చిన్నదిగా కనిపించింది.. ఇప్పుడు అన్నింట్లోకి ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నది జాతిరత్నాలు సినిమానే. ఈ చిత్రానికి విడుదల ముంగిట అనూహ్యమైన హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ యమ జోరు మీదున్నాయి. తొలి రోజు ఈ సినిమా ప్యాక్డ్ హౌసెస్తో నడవబోతోంది. మరి ఈ హైప్కు తగ్గట్లుగా సినిమా ఉంటుందేమో చూడాలి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తున్న ఈ చిత్రం వీకెండ్లో బాక్సాఫీస్ లీడర్గా నిలవడం ఖాయం. తర్వాత ఎలా ముందుకెళ్తుందన్నది టాక్ మీద ఆధారపడి ఉంటుంది.
ఇక శర్వానంద్ నటించిన శ్రీకారం మీద అంచనాలు బాగానే ఉన్నాయి కానీ.. జాతిరత్నాలుతో పోటీ దీనికి ప్రతికూలంగా మారింది. ఆ సినిమా దూకుడు వల్ల దీనికి అనుకున్న స్థాయిలో బుకింగ్స్ లేవు. ఐతే వ్యవసాయం నేపథ్యంలో ఒక ఉదాత్తమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని, పెద్ద విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఇక రాజేంద్రప్రసాద్-శ్రీవిష్ణు ప్రధాన పాత్రలు పోషించిన గాలి సంపత్ కాన్సెప్ట్ పరంగా కొత్తగానే అనిపిస్తోంది. కానీ మిగతా రెండు సినిమాల ముందు ఇది ఏమేర నిలుస్తుందన్నది టాక్ మీద ఆధారపడి ఉంది. మరి ఈ మూడు చిత్రాలకు గురువారం ఎలాంటి టాక్ వస్తుందో.. బాక్సాఫీస్ దగ్గర వాటి పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on March 11, 2021 9:47 am
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…