మే నెల అంటే సినిమాలకు అత్యంత అనుకూలమైన నెల. అన్ని తరగతుల విద్యార్థులూ ఆ నెలలో ఖాళీ అయిపోతారు. ఎండలు పతాక స్థాయికి చేరుకునే మే నెలలో మామూలు జనం కూడా థియేటర్లకు వెళ్లి ఉపశమనం పొందాలని చూసే నెల ఇది. అందుకే ప్రతి ఏడాదీ ఈ నెలలో భారీ సినిమాలు వరుస కడుతుంటాయి. కానీ ఈ ఏడాది కరోనా పుణ్యమా అని థియేటర్లు మూతబడటంతో సినిమాల రిలీజే లేకపోయింది.
మామూలుగా అయితే మాత్రం మే నెల కొత్త సినిమాలతో చాలా సందడిగా ఉంటుంది. మే నెలలో సక్సెస్ రేట్ ఎక్కువ కాగా.. ఈ నెలలో తొమ్మిదో తారీఖున వస్తే మరింత మంచి ఫలితం ఉంటుందనే నమ్మకం సినీ జనాల్లో ఉంది. టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్లో ఒకటైన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలైంది మే 9నే కావడం ఇక్కడ ముందుగా ప్రస్తావించాల్సిన విషయం.
1989 ద్వితీయార్ధంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ పట్టాలెక్కగా.. చాలా ముందుగానే నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే, రిలీజ్ టైంలో తుపాను ఇబ్బంది పెట్టినా ఆ తేదీనే రిలీజ్ చేశారు. ఆ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత ఏడేళ్లకు మే 9న మరో బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. అదే.. ప్రేమించుకుందాం రా.
ప్రేమకథా చిత్రాల్లో అదొక ట్రెండ్ సెట్టర్. వెంకటేష్ కెరీర్లోనే అప్పటికది బిగ్గెస్ట్ హిట్. కట్ చేస్తే గత రెండేళ్లలో కూడా మే 9న రెండు స్పెషల్ మూవీస్ వచ్చాయి. ఆ తేదీకి ప్రత్యేకతను చేకూర్చాయి. 2018 మే 9న ‘మహానటి’ సినిమా రిలీజైంది. దాని నిర్మాత కూడా అశ్వినీదత్యే. ఆయన సంస్థకు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వైభవాన్ని తీసుకొచ్చిన చిత్రమిది. ఇక గత ఏడాది ఇదే తేదీన మహేష్ బాబు సినిమా ‘మహర్షి’ విడుదలైంది. డివైడ్ టాక్ను తట్టుకుని కూడా ఆ సినిమా మంచి విజయాన్నందుకుంది. విశేషం ఏంటంటే.. ఇందులో కూడా దత్ నిర్మాణ భాగస్వామి.
This post was last modified on May 9, 2020 5:19 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…