లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రెండు నెలల నుంచి థియేటర్లు మూత పడి ఉండటం.. ఇంకో నాలుగైదు నెలలు థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఎప్పుడో పూర్తయి విడుదల కోసం చూస్తున్న సినిమాలను నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేసే ప్రతిపాదనలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆల్రెడీ తెలుగులో ‘అమృతారామమ్’ అనే సినిమా ఇలాగే రిలీజైంది.
తమిళంలో కూడా ఓ సినిమాను ఇలా రిలీజ్ చేశారు. వాటికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఐతే కాస్త పేరున్న సినిమాల్ని రిలీజ్ చేస్తే ఈ ట్రెండ్ ఊపందుకోవచ్చు. హిందీలో అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన ‘లక్ష్మీబాంబ్’ను హాట్ స్టార్లో నేరుగా రిలీజ్ చేయబోతున్నారని.. అందుకోసం రూ.90 కోట్లతో డీల్ కుదిరిందని ఇటీవల వార్తలొచ్చాయి. ఐతే ఈ వార్తల్ని చిత్ర బృందం ధ్రువీకరించలేదు. అలాగని ఖండించనూ లేదు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది.
ఐతే ‘లక్ష్మీ బాంబ్’ సంగతేమో కానీ.. హిందీలోనే తెరకెక్కిన ఓ పేరున్న సినిమా మాత్రం ఓటీటీలో నేరుగా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా పేరు.. ‘గూమ్ కేతు’. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఫాంటమ్ ఫిలిమ్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పుష్పేంద్రనాథ్ మిశ్రా దర్శకత్వం వహించాడు.
ఒక రచయిత కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవాజుద్దీన్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, రణ్వీర్ సింగ్, సోనాక్షి సిన్హా లాంటి ప్రముఖ నటులు ఇందులో అతిథి పాత్రలు పోషించడం విశేషం. ఈ సినిమా మే 22న నేరుగా జీ5లో రిలీజ్ కాబోతున్నట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకటించాడు.
తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కావడం, లాభానికే డీల్ కుదరడం, నవాజుద్దీన్కు ఓటీటీల్లో సినిమాలు చూసే ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాను నేరుగా ఆన్ లైన్లో రిలీజ్ చేయడానికి ఇబ్బంది లేకపోయింది.
This post was last modified on May 11, 2020 10:49 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…