టాలీవుడ్లో కార్లంటే మహా మోజున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. మార్కెట్లోకి లగ్జరీ కారు వచ్చిందంటే అతడి కళ్లు దానిపై పడిపోతాయని అంటుంటారు ఇండస్ట్రీ జనాలు. తాజాగా అతను ఏకంగా రూ.5 కోట్ల ధరతో ఓ కారును కొన్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. లాంబర్గిని ఉరుస్ మోడల్ కారును అతను ఇటలీ నుంచి ఆర్డర్ చేశాడట.
ట్యాక్సులతో కలిపితే ఇండియాలో వచ్చి ఆ కారు దిగేసరికి దాని ధర రూ.5 కోట్లు అవుతుందట. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఇప్పటిదాకా ఈ మోడల్ కారును వాడలేదని, ఇండియాలో ఉన్న మోస్ట్ లగ్జీరియస్ కార్లలో ఇదొకటి అవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే ఇలాంటి లగ్జరీ కార్లు మరికొన్ని ఉన్నాయి. ఐతే వాటిలో లేని ఫీచర్స్, కంఫర్ట్ ఈ కారులో ఉంటుందని అంటున్నారు.
దీని ఫీచర్ల గురించి ఆల్రెడీ టాలీవుడ్లో ఒక చర్చ మొదలైపోయింది. కారు మొదలైన 3.6 సెకన్లలోనే టాప్ స్పీడ్ 190 కిలోమీటర్లను అందుకుంటుందట. దీని ఇంజిన్ ఇతర విశేషాల గురించి కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్కు కార్లంటే ఎంతిష్టమో కొన్ని సందర్భాల్లో అభిమానులు కూడా చూశారు. కొన్నేళ్ల కిందట రామ్ చరణ్ ఒక లగ్జరీ కారు కొంటే అతడితో కలిసి ఆ కార్లో కూర్చుని డ్రైవ్ చేసి ముచ్చట తీర్చుకున్నాడు తారక్. అతను కారు ఎక్కితే స్పీడు మామూలుగా ఉండదంటూ పూరి జగన్నాథ్ సహా చాలామంది ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను అతడికి భారీగానే పారితోషకం అందుతోంది. ఈ సినిమాతో తన కెరీర్ మారిపోతుందని ఆశిస్తున్న తారక్.. ఈ చిత్రం పూర్తవుతున్న దశలో తనకు తాను పెద్ద గిఫ్ట్ ఇచ్చుకున్నట్లున్నాడు.
This post was last modified on March 3, 2021 2:45 pm
రామాయణ టీజర్ మీద సోషల్ మీడియాలో ఎంత నెగటివిటీ నడుస్తుందో తెలిసిందే. విజువల్స్ బాగానే ఉన్నప్పటికీ వాటి ప్రెజెంటేషన్, క్వాలిటీ…
మొన్న విడుదలైన రాకాస, బైకర్ రెండూ స్టడీగా ఉన్నాయి. అయితే వాటికొచ్చిన టాక్స్ తో పోల్చుకుంటే వసూళ్లు అంత వేగంగా…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హాట్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా వరకు సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు గ్లామర్…
టాలీవుడ్లో అడివి శేష్ది విచిత్రమైన ప్రయాణం. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కర్మ, కిస్ సినిమాలు తీసి బొక్క బోర్లా పడ్డ అతను..…
ఏపీలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 88 వరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవల కేంద్ర…
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి…