టాలీవుడ్లో కార్లంటే మహా మోజున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. మార్కెట్లోకి లగ్జరీ కారు వచ్చిందంటే అతడి కళ్లు దానిపై పడిపోతాయని అంటుంటారు ఇండస్ట్రీ జనాలు. తాజాగా అతను ఏకంగా రూ.5 కోట్ల ధరతో ఓ కారును కొన్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. లాంబర్గిని ఉరుస్ మోడల్ కారును అతను ఇటలీ నుంచి ఆర్డర్ చేశాడట.
ట్యాక్సులతో కలిపితే ఇండియాలో వచ్చి ఆ కారు దిగేసరికి దాని ధర రూ.5 కోట్లు అవుతుందట. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఇప్పటిదాకా ఈ మోడల్ కారును వాడలేదని, ఇండియాలో ఉన్న మోస్ట్ లగ్జీరియస్ కార్లలో ఇదొకటి అవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే ఇలాంటి లగ్జరీ కార్లు మరికొన్ని ఉన్నాయి. ఐతే వాటిలో లేని ఫీచర్స్, కంఫర్ట్ ఈ కారులో ఉంటుందని అంటున్నారు.
దీని ఫీచర్ల గురించి ఆల్రెడీ టాలీవుడ్లో ఒక చర్చ మొదలైపోయింది. కారు మొదలైన 3.6 సెకన్లలోనే టాప్ స్పీడ్ 190 కిలోమీటర్లను అందుకుంటుందట. దీని ఇంజిన్ ఇతర విశేషాల గురించి కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్కు కార్లంటే ఎంతిష్టమో కొన్ని సందర్భాల్లో అభిమానులు కూడా చూశారు. కొన్నేళ్ల కిందట రామ్ చరణ్ ఒక లగ్జరీ కారు కొంటే అతడితో కలిసి ఆ కార్లో కూర్చుని డ్రైవ్ చేసి ముచ్చట తీర్చుకున్నాడు తారక్. అతను కారు ఎక్కితే స్పీడు మామూలుగా ఉండదంటూ పూరి జగన్నాథ్ సహా చాలామంది ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను అతడికి భారీగానే పారితోషకం అందుతోంది. ఈ సినిమాతో తన కెరీర్ మారిపోతుందని ఆశిస్తున్న తారక్.. ఈ చిత్రం పూర్తవుతున్న దశలో తనకు తాను పెద్ద గిఫ్ట్ ఇచ్చుకున్నట్లున్నాడు.
This post was last modified on March 3, 2021 2:45 pm
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…