టాలీవుడ్లో కార్లంటే మహా మోజున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. మార్కెట్లోకి లగ్జరీ కారు వచ్చిందంటే అతడి కళ్లు దానిపై పడిపోతాయని అంటుంటారు ఇండస్ట్రీ జనాలు. తాజాగా అతను ఏకంగా రూ.5 కోట్ల ధరతో ఓ కారును కొన్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. లాంబర్గిని ఉరుస్ మోడల్ కారును అతను ఇటలీ నుంచి ఆర్డర్ చేశాడట.
ట్యాక్సులతో కలిపితే ఇండియాలో వచ్చి ఆ కారు దిగేసరికి దాని ధర రూ.5 కోట్లు అవుతుందట. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఇప్పటిదాకా ఈ మోడల్ కారును వాడలేదని, ఇండియాలో ఉన్న మోస్ట్ లగ్జీరియస్ కార్లలో ఇదొకటి అవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే ఇలాంటి లగ్జరీ కార్లు మరికొన్ని ఉన్నాయి. ఐతే వాటిలో లేని ఫీచర్స్, కంఫర్ట్ ఈ కారులో ఉంటుందని అంటున్నారు.
దీని ఫీచర్ల గురించి ఆల్రెడీ టాలీవుడ్లో ఒక చర్చ మొదలైపోయింది. కారు మొదలైన 3.6 సెకన్లలోనే టాప్ స్పీడ్ 190 కిలోమీటర్లను అందుకుంటుందట. దీని ఇంజిన్ ఇతర విశేషాల గురించి కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్కు కార్లంటే ఎంతిష్టమో కొన్ని సందర్భాల్లో అభిమానులు కూడా చూశారు. కొన్నేళ్ల కిందట రామ్ చరణ్ ఒక లగ్జరీ కారు కొంటే అతడితో కలిసి ఆ కార్లో కూర్చుని డ్రైవ్ చేసి ముచ్చట తీర్చుకున్నాడు తారక్. అతను కారు ఎక్కితే స్పీడు మామూలుగా ఉండదంటూ పూరి జగన్నాథ్ సహా చాలామంది ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను అతడికి భారీగానే పారితోషకం అందుతోంది. ఈ సినిమాతో తన కెరీర్ మారిపోతుందని ఆశిస్తున్న తారక్.. ఈ చిత్రం పూర్తవుతున్న దశలో తనకు తాను పెద్ద గిఫ్ట్ ఇచ్చుకున్నట్లున్నాడు.
This post was last modified on March 3, 2021 2:45 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…