ఒక టైంలో ఇండియాలో స్పోర్ట్స్ బయోపిక్స్కు భలే డిమాండ్ ఏర్పడింది. పాన్ సింగ్ తోమర్, బాగ్ మిల్కా బాగ్, ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ లాంటి సినిమాలు చాలా బాగా ఆడి ఈ జానర్కు ఊపు తెచ్చాయి. ఆ క్రమంలోనే వరుసగా స్పోర్ట్స్ బయోపిక్స్ అనౌన్స్ చేశారు. హైదరాబాద్ స్పోర్ట్స్ స్టార్లయిన సైనా, సింధు, మిథాలీ రాజ్లతో పాటు కోచ్ గోపీచంద్ మీదా సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటనలు వచ్చాయి. కానీ ఇవన్నీ అనుకున్న సమయానికి పట్టాలెక్కలేకపోయాయి.
సైనా బయోపిక్ను శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేశారు. కారణాలేంటో కానీ.. శ్రద్ధ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో సైనా బయోపిక్ వర్కవుట్ కాదేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ తర్వాత సైనా పాత్ర చేయడానికి పరిణీతి చోప్రా ముందుకొచ్చింది. అంత వరకు మాత్రమే సమాచారం వచ్చింది తప్ప.. ఈ సినిమా మొదలైందా లేదా అన్న క్లారిటీ కూడా లేదు.
ఐతే ఇప్పుడు హఠాత్తుగా సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది చిత్ర బృందం. ‘సైనా’ పేరుతో పరిణీతి లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 26నే విడుదల కాబోతుండటం విశేషం. షటిల్ కాక్ రూపంలో టైటిల్ లోగో డిజైన్ చేసి.. చేతికి భారత త్రివర్ణ పతాకం రంగుల్లో ఉన్న బ్యాండ్ వేసుకుని సర్వీస్ చేస్తున్నట్లుగా తీర్చిదిద్దిన ప్రి లుక్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. ‘ఎన్ ఇన్క్రెడిబుల్ ట్రూ స్టోరీ’.. ‘మార్ దోంగి’ అంటూ ఈ సినిమాకు క్యాప్షన్లు కూడా జోడించారు. హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి అయిన సైనా.. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో వచ్చి స్థిరపడటంతో ఇక్కడే బ్యాడ్మింటన్లోకి అడుగు పెట్టింది.
ఆటగాడిగా కెరీర్ ముగించాక కోచ్గా మారిన గోపీచంద్ శిక్షణలో ఆమె ఈ ఆటలో నైపుణ్యం సంపాదించింది. భారత బ్యాడ్మింటన్లో ఎవరూ చూడని ఎత్తులకు ఆమె చేరుకుంది. ఇప్పుడు సింధు సహా ఎంతోమంది క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్నారంటే అందుకు సైనా అందించిన స్ఫూర్తి ముఖ్య కారణం. మరి ఆమె కథను ఎంత ఆసక్తికరంగా వెండితెరపై ప్రెజెంట్ చేశారో చూడాలి. ఈ చిత్రానికి అమోల్ గుప్తే ద్శకత్వం వహించాడు.
This post was last modified on March 2, 2021 1:58 pm
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి.…
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…