ఒక టైంలో ఇండియాలో స్పోర్ట్స్ బయోపిక్స్కు భలే డిమాండ్ ఏర్పడింది. పాన్ సింగ్ తోమర్, బాగ్ మిల్కా బాగ్, ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ లాంటి సినిమాలు చాలా బాగా ఆడి ఈ జానర్కు ఊపు తెచ్చాయి. ఆ క్రమంలోనే వరుసగా స్పోర్ట్స్ బయోపిక్స్ అనౌన్స్ చేశారు. హైదరాబాద్ స్పోర్ట్స్ స్టార్లయిన సైనా, సింధు, మిథాలీ రాజ్లతో పాటు కోచ్ గోపీచంద్ మీదా సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటనలు వచ్చాయి. కానీ ఇవన్నీ అనుకున్న సమయానికి పట్టాలెక్కలేకపోయాయి.
సైనా బయోపిక్ను శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేశారు. కారణాలేంటో కానీ.. శ్రద్ధ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో సైనా బయోపిక్ వర్కవుట్ కాదేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ తర్వాత సైనా పాత్ర చేయడానికి పరిణీతి చోప్రా ముందుకొచ్చింది. అంత వరకు మాత్రమే సమాచారం వచ్చింది తప్ప.. ఈ సినిమా మొదలైందా లేదా అన్న క్లారిటీ కూడా లేదు.
ఐతే ఇప్పుడు హఠాత్తుగా సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది చిత్ర బృందం. ‘సైనా’ పేరుతో పరిణీతి లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 26నే విడుదల కాబోతుండటం విశేషం. షటిల్ కాక్ రూపంలో టైటిల్ లోగో డిజైన్ చేసి.. చేతికి భారత త్రివర్ణ పతాకం రంగుల్లో ఉన్న బ్యాండ్ వేసుకుని సర్వీస్ చేస్తున్నట్లుగా తీర్చిదిద్దిన ప్రి లుక్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. ‘ఎన్ ఇన్క్రెడిబుల్ ట్రూ స్టోరీ’.. ‘మార్ దోంగి’ అంటూ ఈ సినిమాకు క్యాప్షన్లు కూడా జోడించారు. హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి అయిన సైనా.. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో వచ్చి స్థిరపడటంతో ఇక్కడే బ్యాడ్మింటన్లోకి అడుగు పెట్టింది.
ఆటగాడిగా కెరీర్ ముగించాక కోచ్గా మారిన గోపీచంద్ శిక్షణలో ఆమె ఈ ఆటలో నైపుణ్యం సంపాదించింది. భారత బ్యాడ్మింటన్లో ఎవరూ చూడని ఎత్తులకు ఆమె చేరుకుంది. ఇప్పుడు సింధు సహా ఎంతోమంది క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్నారంటే అందుకు సైనా అందించిన స్ఫూర్తి ముఖ్య కారణం. మరి ఆమె కథను ఎంత ఆసక్తికరంగా వెండితెరపై ప్రెజెంట్ చేశారో చూడాలి. ఈ చిత్రానికి అమోల్ గుప్తే ద్శకత్వం వహించాడు.
This post was last modified on March 2, 2021 1:58 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…