‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలై మూడున్నరేళ్లు దాటిపోయింది. ఆ సినిమాతో ఒక్కసారిగా తనపై అంచనాలు పెంచేసిన సందీప్ రెడ్డి వంగ ఇప్పటిదాకా తెలుగులో మరో సినిమా చేయలేదు. కనీసం కమిట్మెంట్ కూడా ఇచ్చినట్లు కనిపించలేదు. అతడితో పని చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు ఆసక్తితో ఉన్నారు. కానీ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ కోసం రెండేళ్లకు పైగా వెచ్చించిన సందీప్.. బాలీవుడ్లోనే తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. దాన్ని ప్రకటించడంలో చాలా ఆలస్యం జరిగింది.
ఐతే రణబీర్ కపూర్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి పర్వాలేదులే అనుకున్నారు. ఐతే ఈ సినిమానైనా త్వరగా పూర్తి చేసి 2021 చివర్లోనో 2022 ఆరంభంలోనో తెలుగులో కొత్త సినిమాను మొదలుపెడతాడేమో అని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. అతను 2022లో కూడా మళ్లీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపించడం లేదు.
రణబీర్తో సందీప్ చేయనున్న ‘అనిమల్’ సినిమా ఇప్పుడిప్పుడే విడుదల కాబోవట్లేదు. ఈ చిత్రాన్ని 2022 దసరాకు ఫిక్స్ చేశారు. సందీపే స్వయంగా ట్విట్టర్ ద్వారా రిలీజ్ డేట్ ప్రకటించాడు. అంటే సినిమాను ప్రకటించిన రెండేళ్లకు కానీ ఇది రిలీజవ్వదన్నమాట. అప్పటిదాకా సందీప్ వేరే ప్రాజెక్టు గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇక ఈ సినిమా రిలీజయ్యాక కొత్త సినిమా చర్చలు మొదలుపెట్టి దాన్ని ప్రకటించేసరికి 2023 వచ్చేస్తుందేమో.
ఒకవేళ ‘అనిమల్’ బాగా ఆడి బాలీవుడ్లో ఇంకా డిమాండ్ పెరిగిపోతే సందీప్.. అక్కడే మరో పెద్ద హీరోతో తన తర్వాతి సినిమాను సెట్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ నుంచి వచ్చే సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మళ్లీ సందీప్-విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తారని సంకేతాలు వచ్చాయి కానీ.. అదెప్పటికి కార్యరూపం దాల్చుతుందో చూడాలి మరి.
This post was last modified on March 1, 2021 1:33 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…