Movie News

అర్జున్ రెడ్డి దర్శకుడు అప్పటిదాకా రాడు


‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలై మూడున్నరేళ్లు దాటిపోయింది. ఆ సినిమాతో ఒక్కసారిగా తనపై అంచనాలు పెంచేసిన సందీప్ రెడ్డి వంగ ఇప్పటిదాకా తెలుగులో మరో సినిమా చేయలేదు. కనీసం కమిట్మెంట్ కూడా ఇచ్చినట్లు కనిపించలేదు. అతడితో పని చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు ఆసక్తితో ఉన్నారు. కానీ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ కోసం రెండేళ్లకు పైగా వెచ్చించిన సందీప్.. బాలీవుడ్లోనే తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. దాన్ని ప్రకటించడంలో చాలా ఆలస్యం జరిగింది.

ఐతే రణబీర్ కపూర్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి పర్వాలేదులే అనుకున్నారు. ఐతే ఈ సినిమానైనా త్వరగా పూర్తి చేసి 2021 చివర్లోనో 2022 ఆరంభంలోనో తెలుగులో కొత్త సినిమాను మొదలుపెడతాడేమో అని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. అతను 2022లో కూడా మళ్లీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపించడం లేదు.

రణబీర్‌తో సందీప్ చేయనున్న ‘అనిమల్’ సినిమా ఇప్పుడిప్పుడే విడుదల కాబోవట్లేదు. ఈ చిత్రాన్ని 2022 దసరాకు ఫిక్స్ చేశారు. సందీపే స్వయంగా ట్విట్టర్ ద్వారా రిలీజ్ డేట్ ప్రకటించాడు. అంటే సినిమాను ప్రకటించిన రెండేళ్లకు కానీ ఇది రిలీజవ్వదన్నమాట. అప్పటిదాకా సందీప్ వేరే ప్రాజెక్టు గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇక ఈ సినిమా రిలీజయ్యాక కొత్త సినిమా చర్చలు మొదలుపెట్టి దాన్ని ప్రకటించేసరికి 2023 వచ్చేస్తుందేమో.

ఒకవేళ ‘అనిమల్’ బాగా ఆడి బాలీవుడ్లో ఇంకా డిమాండ్ పెరిగిపోతే సందీప్.. అక్కడే మరో పెద్ద హీరోతో తన తర్వాతి సినిమాను సెట్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ నుంచి వచ్చే సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మళ్లీ సందీప్-విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తారని సంకేతాలు వచ్చాయి కానీ.. అదెప్పటికి కార్యరూపం దాల్చుతుందో చూడాలి మరి.

This post was last modified on March 1, 2021 1:33 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

2 hours ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

3 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

3 hours ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

4 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

4 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

5 hours ago