‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలై మూడున్నరేళ్లు దాటిపోయింది. ఆ సినిమాతో ఒక్కసారిగా తనపై అంచనాలు పెంచేసిన సందీప్ రెడ్డి వంగ ఇప్పటిదాకా తెలుగులో మరో సినిమా చేయలేదు. కనీసం కమిట్మెంట్ కూడా ఇచ్చినట్లు కనిపించలేదు. అతడితో పని చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు ఆసక్తితో ఉన్నారు. కానీ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ కోసం రెండేళ్లకు పైగా వెచ్చించిన సందీప్.. బాలీవుడ్లోనే తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. దాన్ని ప్రకటించడంలో చాలా ఆలస్యం జరిగింది.
ఐతే రణబీర్ కపూర్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి పర్వాలేదులే అనుకున్నారు. ఐతే ఈ సినిమానైనా త్వరగా పూర్తి చేసి 2021 చివర్లోనో 2022 ఆరంభంలోనో తెలుగులో కొత్త సినిమాను మొదలుపెడతాడేమో అని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. అతను 2022లో కూడా మళ్లీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపించడం లేదు.
రణబీర్తో సందీప్ చేయనున్న ‘అనిమల్’ సినిమా ఇప్పుడిప్పుడే విడుదల కాబోవట్లేదు. ఈ చిత్రాన్ని 2022 దసరాకు ఫిక్స్ చేశారు. సందీపే స్వయంగా ట్విట్టర్ ద్వారా రిలీజ్ డేట్ ప్రకటించాడు. అంటే సినిమాను ప్రకటించిన రెండేళ్లకు కానీ ఇది రిలీజవ్వదన్నమాట. అప్పటిదాకా సందీప్ వేరే ప్రాజెక్టు గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇక ఈ సినిమా రిలీజయ్యాక కొత్త సినిమా చర్చలు మొదలుపెట్టి దాన్ని ప్రకటించేసరికి 2023 వచ్చేస్తుందేమో.
ఒకవేళ ‘అనిమల్’ బాగా ఆడి బాలీవుడ్లో ఇంకా డిమాండ్ పెరిగిపోతే సందీప్.. అక్కడే మరో పెద్ద హీరోతో తన తర్వాతి సినిమాను సెట్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ నుంచి వచ్చే సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మళ్లీ సందీప్-విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తారని సంకేతాలు వచ్చాయి కానీ.. అదెప్పటికి కార్యరూపం దాల్చుతుందో చూడాలి మరి.
This post was last modified on March 1, 2021 1:33 pm
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి…
ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర…
పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్…
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ…
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…