‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలై మూడున్నరేళ్లు దాటిపోయింది. ఆ సినిమాతో ఒక్కసారిగా తనపై అంచనాలు పెంచేసిన సందీప్ రెడ్డి వంగ ఇప్పటిదాకా తెలుగులో మరో సినిమా చేయలేదు. కనీసం కమిట్మెంట్ కూడా ఇచ్చినట్లు కనిపించలేదు. అతడితో పని చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు ఆసక్తితో ఉన్నారు. కానీ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ కోసం రెండేళ్లకు పైగా వెచ్చించిన సందీప్.. బాలీవుడ్లోనే తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. దాన్ని ప్రకటించడంలో చాలా ఆలస్యం జరిగింది.
ఐతే రణబీర్ కపూర్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి పర్వాలేదులే అనుకున్నారు. ఐతే ఈ సినిమానైనా త్వరగా పూర్తి చేసి 2021 చివర్లోనో 2022 ఆరంభంలోనో తెలుగులో కొత్త సినిమాను మొదలుపెడతాడేమో అని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. అతను 2022లో కూడా మళ్లీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపించడం లేదు.
రణబీర్తో సందీప్ చేయనున్న ‘అనిమల్’ సినిమా ఇప్పుడిప్పుడే విడుదల కాబోవట్లేదు. ఈ చిత్రాన్ని 2022 దసరాకు ఫిక్స్ చేశారు. సందీపే స్వయంగా ట్విట్టర్ ద్వారా రిలీజ్ డేట్ ప్రకటించాడు. అంటే సినిమాను ప్రకటించిన రెండేళ్లకు కానీ ఇది రిలీజవ్వదన్నమాట. అప్పటిదాకా సందీప్ వేరే ప్రాజెక్టు గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇక ఈ సినిమా రిలీజయ్యాక కొత్త సినిమా చర్చలు మొదలుపెట్టి దాన్ని ప్రకటించేసరికి 2023 వచ్చేస్తుందేమో.
ఒకవేళ ‘అనిమల్’ బాగా ఆడి బాలీవుడ్లో ఇంకా డిమాండ్ పెరిగిపోతే సందీప్.. అక్కడే మరో పెద్ద హీరోతో తన తర్వాతి సినిమాను సెట్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ నుంచి వచ్చే సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మళ్లీ సందీప్-విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తారని సంకేతాలు వచ్చాయి కానీ.. అదెప్పటికి కార్యరూపం దాల్చుతుందో చూడాలి మరి.
This post was last modified on March 1, 2021 1:33 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…