బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ల లిస్టు తీస్తే అందులో టాప్-10లో నిలిచే హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. వీళ్లిద్దరూ కొన్ని సమయాల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హోదాలోనూ కొనసాగారు. ఈ మధ్య షారుఖ్ హవా తగ్గింది కానీ.. ఒకప్పుడు అతను బాలీవుడ్ ‘కింగ్’. ఇక సల్మాన్ ఒక మూణ్నాలుగేళ్లు మినహాయిస్తే ఎప్పుడూ టాప్ స్టార్లలో ఒకడిగా కొనసాగుతూనే ఉన్నాడు.
ప్రస్తుతం వీళ్లిద్దరి ఫామ్ ఏమంత గొప్పగా లేదు. షారుఖ్ వరుస డిజాస్టర్లతో అల్లాడిపోతుంటే.. సల్మాన్ కూడా స్థాయికి తగ్గ విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ‘రాధె’లో నటిస్తుండగా.. షారుఖ్ తన తర్వాతి సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. ఐతే త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారన్నది బాలీవుడ్ మీడియా వర్గాల తాజా సమాచారం.
‘ధూమ్-2’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు నిఖిల్ అద్వానీ వీళ్లిద్దరి కలల కాంబినేషన్ను మళ్లీ తరపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఖాన్లిద్దరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే నిఖిల్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్కు స్క్రిప్టు రెడీ చేశాడని.. సల్మాన్, షారుఖ్ ఓకే చెబితే ఈ సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కుతుందని.. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించవచ్చని అంటున్నారు.
ఈ వార్త నిజమే అయితే మాత్రం హిందీ ప్రేక్షకుల ఆనందానికి అవధులువండవు. ఇంతకుముందు షారుఖ్, సల్మాన్ కలిసి ‘కరణ్ అర్జున్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘హమ్ తుమారే హై సనమ్’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ లాంటి సినిమాల్లో నటించారు. గత కొన్నేళ్లలో సల్మాన్ మూవీ ‘ట్యూబ్ లైట్’లో షారుఖ్ క్యామియో రోల్ చేస్తే..షారుఖ్ మూవీ ‘జీరో’లో సల్మాన్ తళుక్కుమన్నాడు. ఐతే వీళ్లిద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ మల్టీస్టారర్ చేసి మాత్రం చాలా కాలం అయిపోయింది.
This post was last modified on April 9, 2020 6:23 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…