బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ల లిస్టు తీస్తే అందులో టాప్-10లో నిలిచే హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. వీళ్లిద్దరూ కొన్ని సమయాల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హోదాలోనూ కొనసాగారు. ఈ మధ్య షారుఖ్ హవా తగ్గింది కానీ.. ఒకప్పుడు అతను బాలీవుడ్ ‘కింగ్’. ఇక సల్మాన్ ఒక మూణ్నాలుగేళ్లు మినహాయిస్తే ఎప్పుడూ టాప్ స్టార్లలో ఒకడిగా కొనసాగుతూనే ఉన్నాడు.
ప్రస్తుతం వీళ్లిద్దరి ఫామ్ ఏమంత గొప్పగా లేదు. షారుఖ్ వరుస డిజాస్టర్లతో అల్లాడిపోతుంటే.. సల్మాన్ కూడా స్థాయికి తగ్గ విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ‘రాధె’లో నటిస్తుండగా.. షారుఖ్ తన తర్వాతి సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. ఐతే త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారన్నది బాలీవుడ్ మీడియా వర్గాల తాజా సమాచారం.
‘ధూమ్-2’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు నిఖిల్ అద్వానీ వీళ్లిద్దరి కలల కాంబినేషన్ను మళ్లీ తరపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఖాన్లిద్దరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే నిఖిల్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్కు స్క్రిప్టు రెడీ చేశాడని.. సల్మాన్, షారుఖ్ ఓకే చెబితే ఈ సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కుతుందని.. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించవచ్చని అంటున్నారు.
ఈ వార్త నిజమే అయితే మాత్రం హిందీ ప్రేక్షకుల ఆనందానికి అవధులువండవు. ఇంతకుముందు షారుఖ్, సల్మాన్ కలిసి ‘కరణ్ అర్జున్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘హమ్ తుమారే హై సనమ్’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ లాంటి సినిమాల్లో నటించారు. గత కొన్నేళ్లలో సల్మాన్ మూవీ ‘ట్యూబ్ లైట్’లో షారుఖ్ క్యామియో రోల్ చేస్తే..షారుఖ్ మూవీ ‘జీరో’లో సల్మాన్ తళుక్కుమన్నాడు. ఐతే వీళ్లిద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ మల్టీస్టారర్ చేసి మాత్రం చాలా కాలం అయిపోయింది.
This post was last modified on April 9, 2020 6:23 pm
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…
హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…