విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన చంద్రశేఖర్ యేలేటి నుంచి వచ్చిన కొత్త సినిమా చెక్. శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలో దిగింది. యేలేటి సినిమా అంటే ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి గురి ఉంటుంది. వాళ్లు పరుగెత్తుకుని సినిమాకు వచ్చేస్తారు. భారీ అంచనాలతో ఆయన సినిమా చూస్తారు. సాధారణ ప్రేక్షకులు చెక్ పర్వాలేదని, చల్తా అని అంటుంటే.. యేలేటి అభిమానులే ఈ సినిమా పట్ల ఎక్కువగా అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఎందుకంటే ఆయనపై వారకున్న అంచనాలు అలాంటివి. ఐతే, అనుకోకుండా ఒక రోజు లాంటి చిత్రాలతో యేలేటి కెరీర్ ఆరంభంలోనే తనపై అంచనాలు బాగా పెంచేశాడు. స్క్రీన్ ప్లే విషయంలో మాస్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఏం తీసినా ఒరిజినల్గా ఉంటుందని, కాపీకి ఛాన్సే ఉండదని బలంగా నమ్ముతారు యేలేటి అభిమానులు.
ఇలాంటి దర్శకుడు చెక్ సినిమా క్లైమాక్స్ విషయంలో హాలీవుడ్ క్లాసిక్ శ్వశాంక్ రిడెంప్షన్ను ఫాలో అయిపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఈ సినిమాలో ఈ ట్విస్ట్ ప్రేక్షకులను బాగానే థ్రిల్ చేస్తుంది. ఇలాంటి క్లైమాక్స్ ఊహించరు. కానీ శ్వశాంక్ రిడెంప్షన్ చూసిన వాళ్లకు మాత్రం ఆ సినిమా క్లైమాక్స్ను యేలేటి కాపీ కొట్టేశాడనే అనిపిస్తుంది. ఎందుకంటే అందులోనూ హీరో చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. చివర్లో ఎవరూ ఊహించనిది చేస్తాడు.
చెక్ కథ, క్లైమాక్స్ ట్విస్టు దానికి దగ్గరగా ఉండటం యేలేటి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో పేరులేని సినిమా నుంచి ఐడియా తీసుకున్నా ఓకే కానీ.. ఆల్ టైం క్లాసిక్స్లో ఒకటిగా పేరున్న సినిమా నుంచి ఆయన కాపీ కొట్టడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ క్వీన్స్ గాంబెట్తోనూ చెక్కు కొంచెం పోలికలు కనిపించాయి.
This post was last modified on February 27, 2021 10:17 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…