సాయిపల్లవి తెలుగులో చేసిన సినిమాలు తక్కువే. కానీ వాటితో వచ్చిన పేరు మాత్రం అంతా ఇంతా కాదు. తెలుగులో నటించిన తొలి చిత్రం ‘ఫిదా’తోనే ఆమె పేరు మార్మోగిపోయింది. ఇక తర్వాత నటించిన ప్రతి సినిమాతోనూ తన ప్రతిష్టను పెంచుకుంటూ పోయింది. కేవలం ఆమెను చూడ్డానికి లక్షలాది మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారంటే అతిశయోక్తి కాదు.
ఇప్పటికే తెలుగులో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న సాయిపల్లవి.. ఈ ఏడాది మరింతగా విజృంభించేలా కనిపిస్తోంది. ఆమె నటిస్తున్న సినిమాలన్నీ రిలీజై అవి అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం ఆమె రేంజే మారిపోవచ్చు. మరే హీరోయిన్ అందుకోలేని స్థాయికి ఆమె చేరుకోవచ్చు. తెలుగులో సాయిపల్లవి ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఆ మూడింట్లోనూ తన పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉండేలా కనిపిస్తున్నాయి.
సాయిపల్లవి నటిస్తున్న కొత్త చిత్రాల్లో ‘విరాట పర్వం’ అత్యంత ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ సినిమాలో హీరో రానా కంటే సాయిపల్లవి పాత్ర కీలకం అంటున్నారు. ఈ చిత్ర ప్రోమోల్లో సాయిపల్లవి కట్టిపడేస్తోంది. నక్సలిజం నేపథ్యంలో చాలా ఎమోషనల్గా సాగే ఈ సినిమాలో సాయిపల్లవి కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ పాత్రలో నటిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక తనకు ‘ఫిదా’ లాంటి మరపురాని చిత్రాన్నందించిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ‘లవ్ స్టోరి’లోనూ సాయిపల్లవి పాత్ర ప్రత్యేకంగా ఉండేలానే కనిపిస్తోంది. ‘ఫిదా’ మాదిరే ఇది కూడా సాయిపల్లవి కెరీర్లో ఒక మైలురాయిలా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు నాని కొత్త సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ కూడా భిన్నంగా, కొత్తగా అనిపిస్తోంది. కోల్కతా నేపథ్యంలో కొన్ని దశాబ్దాల వెనుకటి కాలంలో నడిచే ఈ సినిమాలో సాయిపల్లవి మరో కొత్త అవతారంలో కనిపించబోతోంది. ప్రస్తుతం చేస్తున్న ఈ మూడు చిత్రాలు కాకుండా పవన్ సరసన ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్లోనూ సాయిపల్లవి ఒక స్పెషల్ రోల్ చేస్తోంది. తెలుగులో పెద్ద స్టార్ సరసన చేయబోతున్న తొలి చిత్రమిది. ఒరిజినల్ ప్రకారం చూస్తే ఈ పాత్ర కూడా సాయిపల్లవికి పేరు తెచ్చేదే. వరుసగా క్రేజీ సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలతో సాయిపల్లవి ఈ ఏడాది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారేలా ఉంది.
This post was last modified on February 25, 2021 6:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…