ఇటీవల ‘నాంది’ సినిమా బృందం కోసం అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా అభినందన సభ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. నిజానికి ఈ సినిమాతో రాజుకు ఎలాంటి సంబంధం లేదు. చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల.. హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా రాజు సంస్థలో కొన్ని సినిమాలకు పని చేశాడు తప్పితే.. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ పరంగా ఈ చిత్రంతో రాజుకు ఏ కనెక్షన్ లేదు.
‘నాంది’ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న రాజు చెబుతూ.. కేవలం ఈ సినిమా నచ్చి చిత్ర బృందాన్ని అభినందించాలనుకున్నానని, ఇలాంటి మంచి చిత్రం ప్రేక్షకులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించానని తెలిపాడు. ఐతే ఈ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ.. ఈ చిత్రంతో రాజుకు వేరే కనెక్షన్ ఉందన్న సమాచారం ఇప్పుడు బయటికి వచ్చింది. ‘నాంది’ రీమేక్ హక్కులను రాజునే కొన్నాడట.
‘నాంది’లో చేయని నేరానికి శిక్ష అనుభవించిన ఒక సామాన్యుడు తనను ఇరికించిన వారిపై చట్టం సాయంతోనే ప్రతీకారం తీర్చుకునే పాయింట్ అన్ని భాషల వాళ్లకూ కనెక్ట్ అవుతుందని, ఈ కాన్సెప్ట్గా ఇంకా బాగా, పెద్ద స్థాయిలో తీస్తే వర్కవుట్ అవుతుందని రాజు భావించి.. పలు భాషల్లో ఈ చిత్రాన్ని పునర్నిర్మించాలని భావించాడని, అన్ని భాషలకూ కలిపి మంచి రేటుకు రీమేక్ హక్కులు కొన్నాడని సమాచారం.
ఇప్పటికే ‘జెర్సీ’ రీమేక్తో బాలీవుడ్లో అడుగు పెడుతున్న రాజు.. ‘నాంది’ని కూడా అక్కడి ఓ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి హిందీలో రీమేక్ చేయబోతున్నాడని అంటున్నారు. ‘నాంది’ టీంను పిలిచి అభినందన సభ ఏర్పాటు చేయడం వెనుక అసలు కారణం ఇదే అని చెబుతున్నారు. ‘నాంది’ అల్లరి నరేష్కు ఎనిమిదేళ్ల తర్వాత విజయాన్నందించడమే కాక.. ఇంతగా ప్రశంసలందుకుని, వేరే భాషల్లోకి కూడా రీమేక్ కాబోతోందంటే విశేషమే.
This post was last modified on February 25, 2021 4:14 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…