ఇటీవల ‘నాంది’ సినిమా బృందం కోసం అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా అభినందన సభ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. నిజానికి ఈ సినిమాతో రాజుకు ఎలాంటి సంబంధం లేదు. చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల.. హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా రాజు సంస్థలో కొన్ని సినిమాలకు పని చేశాడు తప్పితే.. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ పరంగా ఈ చిత్రంతో రాజుకు ఏ కనెక్షన్ లేదు.
‘నాంది’ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న రాజు చెబుతూ.. కేవలం ఈ సినిమా నచ్చి చిత్ర బృందాన్ని అభినందించాలనుకున్నానని, ఇలాంటి మంచి చిత్రం ప్రేక్షకులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించానని తెలిపాడు. ఐతే ఈ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ.. ఈ చిత్రంతో రాజుకు వేరే కనెక్షన్ ఉందన్న సమాచారం ఇప్పుడు బయటికి వచ్చింది. ‘నాంది’ రీమేక్ హక్కులను రాజునే కొన్నాడట.
‘నాంది’లో చేయని నేరానికి శిక్ష అనుభవించిన ఒక సామాన్యుడు తనను ఇరికించిన వారిపై చట్టం సాయంతోనే ప్రతీకారం తీర్చుకునే పాయింట్ అన్ని భాషల వాళ్లకూ కనెక్ట్ అవుతుందని, ఈ కాన్సెప్ట్గా ఇంకా బాగా, పెద్ద స్థాయిలో తీస్తే వర్కవుట్ అవుతుందని రాజు భావించి.. పలు భాషల్లో ఈ చిత్రాన్ని పునర్నిర్మించాలని భావించాడని, అన్ని భాషలకూ కలిపి మంచి రేటుకు రీమేక్ హక్కులు కొన్నాడని సమాచారం.
ఇప్పటికే ‘జెర్సీ’ రీమేక్తో బాలీవుడ్లో అడుగు పెడుతున్న రాజు.. ‘నాంది’ని కూడా అక్కడి ఓ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి హిందీలో రీమేక్ చేయబోతున్నాడని అంటున్నారు. ‘నాంది’ టీంను పిలిచి అభినందన సభ ఏర్పాటు చేయడం వెనుక అసలు కారణం ఇదే అని చెబుతున్నారు. ‘నాంది’ అల్లరి నరేష్కు ఎనిమిదేళ్ల తర్వాత విజయాన్నందించడమే కాక.. ఇంతగా ప్రశంసలందుకుని, వేరే భాషల్లోకి కూడా రీమేక్ కాబోతోందంటే విశేషమే.
This post was last modified on February 25, 2021 4:14 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…