Movie News

పవన్ సినిమా కోసం ఫేవరెట్ టెక్నీషియన్‌


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో అత్యంత ఇష్టపడే, గౌరవించే టెక్నీషియన్లలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఒకరు. పవన్ తెరంగేట్రం చేయడానికి ముందు నుంచే ఆనంద్‌తో పరిచయం ఉంది. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్నపుడే ఆయనతో ఎక్కువగా సమయం గడిపేవాడు. సినిమాకు సంబంధించి సాంకేతిక విషయాలు ఎన్నో ఆనంద్ నుంచి నేర్చుకున్నట్లు పవన్ ఇంటర్వ్యూల్లో చెబుతూ ఉంటాడు. పవన్ నటించిన తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి, జల్సా లాంటి చిత్రాలకు కళా దర్శకత్వం వహించాడు ఆనంద్ సాయి. వ్యక్తిగతంగా కూడా వీరి మధ్య మంచి అనుబంధం ఉంది.

కొంత విరామం తర్వాత పవన్ సినిమాకు ఆనంద్ సాయి పని చేయబోతున్నాడు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ను పూర్తి చేసి క్రిష్ సినిమాతో పాటు, ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్2లో పవన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి రెండూ పూర్తయ్యాక పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్న సంగతీ విదితమే.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఆ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సాయి పని చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మైత్రీ సంస్థ ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించింది. ఆనంద్ సాయి ఐదేళ్లకు పైగా విరామం తర్వాత ఓ సినిమాకు పని చేస్తుండటం విశేషం. ఈ ఐదేళ్లు ఆయన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలకంగా ఉన్నారు.

ఈ ఆలయాన్ని డిజైన్ చేసింది, దగ్గరుంచి నిర్మాణాన్ని పూర్తి చేయించింది ఆనంద్ సాయినే. ఈ ఆలయ డిజైన్‌కు ఎంతగా ప్రశంసలు దక్కాయో తెలిసిందే. ఈ ఆలయం పూర్తి స్థాయిలో సిద్ధమైతే దాని కళే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా అది విలసిల్లే అవకాశముంది. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణం చివరి దశలో ఉంది. పవన్-హరీష్ సినిమా మొదలవడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ లోపు ఆనంద్ సాయి యాదాద్రి పనంతా పూర్తి చేస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.

Satya

Recent Posts

రామాయణ ఇంకెప్పుడు మేలుకుంటుంది

ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…

5 hours ago

పెద్దోళ్ల కమిటీ… జగన్ కు నచ్చట్లేదా?

వైసీపీలో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. పీఏసీకి…

8 hours ago

రణ్వీర్ నిషేధం… హీరోలకు ఒక పాఠం

రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…

11 hours ago

భార‌త్ బంగారం అమ్మేసిందా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇంధ‌నం, బంగారం దిగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని వెచ్చిస్తున్న విష‌యం…

11 hours ago

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

13 hours ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

14 hours ago