పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒడుదొడుకులు ఎదుర్కొని ఉండొచ్చు. ఆయన పార్టీ గత ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు అందుకుని ఉండొచ్చు. పవన్ స్వయంగా రెండుచోట్ల ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఆయన రాజకీయ విధానాలు, లక్ష్యాలు, వివిధ అంశాలపై ఆయన స్పందించే తీరు కొంతమందిని బాగానే ఆకట్టుకుంటూనే ఉంటాయి.
కొంతమంది పవన్ మాటలతో ఎంతో ప్రభావితం అవుతుంటారు కూడా. దర్శకుడు చిన్ని కూడా అలాగే ప్రభావితం అయి ఓ సినిమా తీసేయడం విశేషం. ఇంతకుముందు ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో ఓ కామెడీ క్యారెక్టర్ చేసిన చిన్ని.. ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’, ‘లండన్ బాబులు’ సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి నుంచి రానున్న కొత్త చిత్రం.. అక్షర. ఈ సినిమా కథ పవన్ మాటల నుంచే పుట్టిందని అతను వెల్లడించాడు.
‘అక్షర’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ కథ రాయడానికి పవన్ ఎలా స్ఫూర్తినిచ్చాడో వీడియో ద్వారా వివరించాడు చిన్ని. పవన్ కొన్ని సందర్భాల్లో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడిన వీడియోలను తెరపైన ప్రదర్శించారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో, ఒత్తిడి లేకుండా చదువుకోవాలని.. అప్పుడే వారు మంచి విజ్ఞానంతో, ఉన్నతమైన వ్యక్తులుగా తయారవుతారని.. అలా కాకుండా కార్పొరేట్ కళాశాలల్లో నాలుగ్గోడల మధ్య బంధించి ఎంతసేపూ చదువు చదువు అంటూ వాళ్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ పవన్ ఈ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. మన విద్యా వ్యవస్థలో రావాల్సిన మరిన్ని మార్పుల గురించి పవన్ ఇందులో మాట్లాడాడు. ఈ ప్రసంగాల నుంచి స్ఫూర్తి పొంది తాను ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాల నేపథ్యంలో ‘అక్షర’ కథ రాసినట్లు చిన్ని వెల్లడించాడు. ఆ రకంగా ఈ సినిమాకు స్ఫూర్తి కచ్చితంగా పవనే అని చిన్ని స్పష్టం చేశాడు.
This post was last modified on February 24, 2021 4:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…