‘బాహుబలి’తో ప్రభాస్ ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. బాలీవుడ్ వాళ్లు కూడా అతణ్ని చూసి భయపడే పరిస్థితి వచ్చింది. అతడి చిత్రాలకు పోటీగా హిందీ సినిమాలు రిలీజ్ చేయడానికి వెనుకంజ వేశారు. ‘సాహో’ పోటీ లేకుండా విడుదలైంది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యేసరికి బాలీవుడ్ ఆలోచన మారినట్లుంది.
ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ జులై 30కి షెడ్యూల్ అయిందని తెలిసి కూడా ఓ చిత్రాన్ని అదే రోజు బాక్సాఫీస్ బరిలో నిలిపారు. అది ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ సినిమా పేరు.. గంగూబాయ్ కతియావాడీ. ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఇందులో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు ఈ రోజే ప్రకటించారు.
‘సాహో’తో పోలిస్తే ‘రాధేశ్యామ్’ మీద అంచనాలు తక్కువే. పైగా ప్రభాస్ నుంచి ఉత్తరాది ప్రేక్షకులు మాస్ సినిమాలే ఆశిస్తున్నారు. అతను క్లాస్ లవ్ స్టోరీ చేస్తున్నాడనేసరికి ‘రాధేశ్యామ్’ మీద అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. పైగా ఇటీవల రిలీజైన ‘రాధేశ్యామ్’ ఫస్ట్ గ్లింప్స్ నిరాశ పరిచింది. దీనిపై బాలీవుడ్ క్రిటిక్స్ విమర్శలు గుప్పించారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నెమ్మదిగా ఉత్తరాదిన స్టార్ డమ్ కోల్పోతున్నాడని వ్యాఖ్యానించారు.
ఐతే ప్రభాస్ తర్వాత చేయబోయే మూడు సినిమాల మీద బాగానే ఆసక్తి ఉంది కానీ.. ‘రాధేశ్యామ్’ మీదే రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సినిమాకు భయపడాల్సిన పని లేదని బన్సాలీ టీం భావించినట్లుంది. బన్సాలీ సినిమా అంటే ఆషామాషీగా ఏమీ ఉండదు. ఆయన బలమైన కథతోనే రంగంలోకి దిగి ఉంటారు. ప్రభాస్ సినిమా బాగున్నా కూడా తమ చిత్రానికి కూడా బాక్సాఫీస్ దగ్గర స్కోప్ ఉందని చిత్ర బృందం జులై 30కి సినిమా షెడ్యూల్ చేసి ఉండొచ్చు.
This post was last modified on February 24, 2021 3:55 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…