అగ్ర నిర్మాత దిల్ రాజు హీరో అల్లరి నరేష్కు మంచి ఆఫర్ ఇచ్చాడు. అతను మంచి కథ రెడీ చేసుకుని వస్తే తాను అతడితో సినిమా నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. ఇది నాంది చిత్ర అభినందన సభలో ఇచ్చిన హామీ కావడం విశేషం. ఈ అభినందన సభ ఏర్పాటు చేసింది కూడా దిల్ రాజే.
నాంది సినిమాతో తనకే సంబంధం లేదని.. ప్రొడక్షన్లో కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ తాను భాగస్వామిని కాదని.. ఐతే ఈ సినిమా గురించి అందరూ మంచి మాటలు చెబుతుండటం, మంచి రివ్యూలు రావడం చూసి సినిమా చూశానని.. ఇది చాలా మంచి సినిమా అనిపించి, ఇలాంటి సినిమాను తన వంతు బాధ్యతగా ప్రమోట్ చేయాలని, చిత్ర బృందాన్ని అభినందించాలని అనిపించి చొరవ తీసుకుని ఈ అభినందన సభ ఏర్పాటు చేయించినట్లు రాజు వెల్లడించాడు. ఈ ఏడాది తన సినిమాలు ఏడెనిమది దాకా ప్రొడక్షన్ దశలో ఉన్నాయని.. వాటి కోసమే చాలాసార్లు మీడియాను కలవాల్సి ఉంటుందని, కాబట్టి వేరే సినిమాల వేడుకలకు వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్న తాను.. నాంది టీం పిలవకపోయినా తనే వాళ్లను పిలిచి ఈ సభ ఏర్పాటు చేశానన్నాడు.
ఈ సినిమాతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారని, డిస్ట్రిబ్యూటర్లందరూ లాభాలు అందుకుంటున్నారని, ఇలాంటి మంచి సినిమాలు ఆడాల్సిన అవసరం చాలా ఉందని, ప్రేక్షకులు మరింతగా ఈ సినిమా చూసి ప్రోత్సహించాలని రాజు అభిలషించాడు. తాను కింద కూర్చున్నపుడు తనతో ఎప్పుడు సినిమా తీస్తారని నరేష్ అడిగాడని.. ఇప్పుడు సభాముఖంగా చెబుతున్నానని, అతను కథ రెడీ చేసుకుని వస్తే వెంటనే తన బేనర్లో సినిమా తీస్తానని రాజు హామీ ఇచ్చాడు.
నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల తన బేనర్లో మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడని, కానీ నాంది కథ చెప్పడం కానీ, ఆ సినిమా చూపించడం మాత్రం చేయలేదని, సినిమా బాగుంటే తనే చూసి అభినందిస్తానన్నది అతడి ఆత్మవిశ్వాసం కావచ్చని రాజు చెప్పాడు.
This post was last modified on February 24, 2021 10:53 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…