అగ్ర నిర్మాత దిల్ రాజు హీరో అల్లరి నరేష్కు మంచి ఆఫర్ ఇచ్చాడు. అతను మంచి కథ రెడీ చేసుకుని వస్తే తాను అతడితో సినిమా నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. ఇది నాంది చిత్ర అభినందన సభలో ఇచ్చిన హామీ కావడం విశేషం. ఈ అభినందన సభ ఏర్పాటు చేసింది కూడా దిల్ రాజే.
నాంది సినిమాతో తనకే సంబంధం లేదని.. ప్రొడక్షన్లో కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ తాను భాగస్వామిని కాదని.. ఐతే ఈ సినిమా గురించి అందరూ మంచి మాటలు చెబుతుండటం, మంచి రివ్యూలు రావడం చూసి సినిమా చూశానని.. ఇది చాలా మంచి సినిమా అనిపించి, ఇలాంటి సినిమాను తన వంతు బాధ్యతగా ప్రమోట్ చేయాలని, చిత్ర బృందాన్ని అభినందించాలని అనిపించి చొరవ తీసుకుని ఈ అభినందన సభ ఏర్పాటు చేయించినట్లు రాజు వెల్లడించాడు. ఈ ఏడాది తన సినిమాలు ఏడెనిమది దాకా ప్రొడక్షన్ దశలో ఉన్నాయని.. వాటి కోసమే చాలాసార్లు మీడియాను కలవాల్సి ఉంటుందని, కాబట్టి వేరే సినిమాల వేడుకలకు వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్న తాను.. నాంది టీం పిలవకపోయినా తనే వాళ్లను పిలిచి ఈ సభ ఏర్పాటు చేశానన్నాడు.
ఈ సినిమాతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారని, డిస్ట్రిబ్యూటర్లందరూ లాభాలు అందుకుంటున్నారని, ఇలాంటి మంచి సినిమాలు ఆడాల్సిన అవసరం చాలా ఉందని, ప్రేక్షకులు మరింతగా ఈ సినిమా చూసి ప్రోత్సహించాలని రాజు అభిలషించాడు. తాను కింద కూర్చున్నపుడు తనతో ఎప్పుడు సినిమా తీస్తారని నరేష్ అడిగాడని.. ఇప్పుడు సభాముఖంగా చెబుతున్నానని, అతను కథ రెడీ చేసుకుని వస్తే వెంటనే తన బేనర్లో సినిమా తీస్తానని రాజు హామీ ఇచ్చాడు.
నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల తన బేనర్లో మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడని, కానీ నాంది కథ చెప్పడం కానీ, ఆ సినిమా చూపించడం మాత్రం చేయలేదని, సినిమా బాగుంటే తనే చూసి అభినందిస్తానన్నది అతడి ఆత్మవిశ్వాసం కావచ్చని రాజు చెప్పాడు.
This post was last modified on February 24, 2021 10:53 am
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…
అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…