అగ్ర నిర్మాత దిల్ రాజు హీరో అల్లరి నరేష్కు మంచి ఆఫర్ ఇచ్చాడు. అతను మంచి కథ రెడీ చేసుకుని వస్తే తాను అతడితో సినిమా నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. ఇది నాంది చిత్ర అభినందన సభలో ఇచ్చిన హామీ కావడం విశేషం. ఈ అభినందన సభ ఏర్పాటు చేసింది కూడా దిల్ రాజే.
నాంది సినిమాతో తనకే సంబంధం లేదని.. ప్రొడక్షన్లో కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ తాను భాగస్వామిని కాదని.. ఐతే ఈ సినిమా గురించి అందరూ మంచి మాటలు చెబుతుండటం, మంచి రివ్యూలు రావడం చూసి సినిమా చూశానని.. ఇది చాలా మంచి సినిమా అనిపించి, ఇలాంటి సినిమాను తన వంతు బాధ్యతగా ప్రమోట్ చేయాలని, చిత్ర బృందాన్ని అభినందించాలని అనిపించి చొరవ తీసుకుని ఈ అభినందన సభ ఏర్పాటు చేయించినట్లు రాజు వెల్లడించాడు. ఈ ఏడాది తన సినిమాలు ఏడెనిమది దాకా ప్రొడక్షన్ దశలో ఉన్నాయని.. వాటి కోసమే చాలాసార్లు మీడియాను కలవాల్సి ఉంటుందని, కాబట్టి వేరే సినిమాల వేడుకలకు వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్న తాను.. నాంది టీం పిలవకపోయినా తనే వాళ్లను పిలిచి ఈ సభ ఏర్పాటు చేశానన్నాడు.
ఈ సినిమాతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారని, డిస్ట్రిబ్యూటర్లందరూ లాభాలు అందుకుంటున్నారని, ఇలాంటి మంచి సినిమాలు ఆడాల్సిన అవసరం చాలా ఉందని, ప్రేక్షకులు మరింతగా ఈ సినిమా చూసి ప్రోత్సహించాలని రాజు అభిలషించాడు. తాను కింద కూర్చున్నపుడు తనతో ఎప్పుడు సినిమా తీస్తారని నరేష్ అడిగాడని.. ఇప్పుడు సభాముఖంగా చెబుతున్నానని, అతను కథ రెడీ చేసుకుని వస్తే వెంటనే తన బేనర్లో సినిమా తీస్తానని రాజు హామీ ఇచ్చాడు.
నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల తన బేనర్లో మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడని, కానీ నాంది కథ చెప్పడం కానీ, ఆ సినిమా చూపించడం మాత్రం చేయలేదని, సినిమా బాగుంటే తనే చూసి అభినందిస్తానన్నది అతడి ఆత్మవిశ్వాసం కావచ్చని రాజు చెప్పాడు.
This post was last modified on February 24, 2021 10:53 am
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…