పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్దగా హడావుడి లేకుండా ఓ భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందిస్తుంటే.. పవన్తో ఒకప్పుడు ‘ఖుషి’ లాంటి ఆల్ టైం బ్లాక్బస్టర్ అందించిన సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నం దీన్ని నిర్మిస్తున్నాడు. పవన్ నటిస్తున్న మిగతా చిత్రాలతో పోలిస్తే దీని గురించి మీడియాలో పెద్దగా హడావుడి లేదు. ఐతే పవన్ కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్లో తెరకెక్కతున్న సినిమా అని, ఇది పవన్కు మినీ బాహుబలి లాంటి సినిమా కాగలదని చిత్ర వర్గాలు అంటున్నాయి. రెండు శతాబ్దాల వెనుకటి కథాంశంతో చారిత్రక నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసమే ‘హరహర వీరమల్లు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్ర చేస్తున్నాడని తెెలుస్తోంది.
కాగా ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో భారీ ఎత్తున చార్మినార్ సెట్ వేసి సినిమాకు సంబంధించి కీలక దృశ్యాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో హైదరాబాద్ పాత బస్తీకి చెందిన పహిల్వాన్లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వారితో కలిసి లొకేషన్లో పవన్ దిగిన ఫొటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి. పాత బస్తీ పహిల్వాన్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. శతాబ్దాల కిందట్నుంచి అక్కడి కొన్ని కుటుంబాలు కుస్తీని వారసత్వంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు వారి ప్రభ తగ్గింది కానీ.. ప్రతి ఇంటి ముందు ఒక కుస్తీ అఖాడాను ఏర్పాటు చేసుకుని వాటిలో సాధన చేసేవారు పహిల్వాన్ల కుటుంబీకులు. ఇప్పటికీ కొన్ని కుటుంబాలు కుస్తీకే అంకితం అయ్యాయి. గొప్ప చరిత్ర ఉన్న ఆ కుటుంబాల నుంచే పహిల్వాన్లు పవన్-క్రిష్ సినిమా కోసం షూటింగ్లో పాల్గొంటున్నారు. కుస్తీ నేపథ్యంలో సినిమాలో భీకరమైన పోరాట దృశ్యాలుంటాయని, వాటినే క్రిష్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నాడని సమాచారం. మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యమున్న పవన్.. కుస్తీ సన్నివేశాల్లో ఎలా మెరుస్తాడో చూడాలి మరి.
This post was last modified on February 23, 2021 11:44 pm
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…