Movie News

పహిల్వాన్లతో పవన్ పోరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్దగా హడావుడి లేకుండా ఓ భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందిస్తుంటే.. పవన్‌తో ఒకప్పుడు ‘ఖుషి’ లాంటి ఆల్ టైం బ్లాక్‌బస్టర్ అందించిన సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నం దీన్ని నిర్మిస్తున్నాడు. పవన్ నటిస్తున్న మిగతా చిత్రాలతో పోలిస్తే దీని గురించి మీడియాలో పెద్దగా హడావుడి లేదు. ఐతే పవన్ కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్లో తెరకెక్కతున్న సినిమా అని, ఇది పవన్‌కు మినీ బాహుబలి లాంటి సినిమా కాగలదని చిత్ర వర్గాలు అంటున్నాయి. రెండు శతాబ్దాల వెనుకటి కథాంశంతో చారిత్రక నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసమే ‘హరహర వీరమల్లు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్ర చేస్తున్నాడని తెెలుస్తోంది.

కాగా ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో భారీ ఎత్తున చార్మినార్ సెట్ వేసి సినిమాకు సంబంధించి కీలక దృశ్యాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో హైదరాబాద్‌ పాత బస్తీకి చెందిన పహిల్వాన్లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వారితో కలిసి లొకేషన్లో పవన్ దిగిన ఫొటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి. పాత బస్తీ పహిల్వాన్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. శతాబ్దాల కిందట్నుంచి అక్కడి కొన్ని కుటుంబాలు కుస్తీని వారసత్వంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు వారి ప్రభ తగ్గింది కానీ.. ప్రతి ఇంటి ముందు ఒక కుస్తీ అఖాడాను ఏర్పాటు చేసుకుని వాటిలో సాధన చేసేవారు పహిల్వాన్ల కుటుంబీకులు. ఇప్పటికీ కొన్ని కుటుంబాలు కుస్తీకే అంకితం అయ్యాయి. గొప్ప చరిత్ర ఉన్న ఆ కుటుంబాల నుంచే పహిల్వాన్లు పవన్-క్రిష్ సినిమా కోసం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కుస్తీ నేపథ్యంలో సినిమాలో భీకరమైన పోరాట దృశ్యాలుంటాయని, వాటినే క్రిష్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నాడని సమాచారం. మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యమున్న పవన్.. కుస్తీ సన్నివేశాల్లో ఎలా మెరుస్తాడో చూడాలి మరి.

suman

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

3 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

5 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

5 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

7 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

10 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

11 hours ago