‘ఉప్పెన’ సినిమాకు ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా తొందరపడలేదు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు. ఎంత ఆలస్యం అయినా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. ఆ పట్టుదల వారికి అద్భుతమైన ఫలితాన్ని అందిస్తోంది. ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల షేర్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. రెండో వారంలోనూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. కొత్తగా రిలీజైన సినిమాలను వెనక్కి నెట్టి బాక్సాఫీస్ లీడర్గా నిలిచింది. సెకండ్ వీకెండ్ అయ్యాక కూడా ఈ చిత్రానికి మంచి షేర్ వస్తోంది. మెజారిటీ ఏరియాల్లో ‘ఉప్పెన’ను సొంతంగా రిలీజ్ చేసిన మైత్రీ వాళ్లకు భారీ లాభాలు అందుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ ద్వారానే ఊహించని లాభాలు అందుకుంటున్న నిర్మాతలకు.. ఇతర మార్గాల్లోనూ పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చి పడుతోంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వాళ్లకు మంచి రేటుకు డిజిటల్ హక్కులు అమ్మారు మైత్రీ అధినేతలు.
ఇంకా శాటిలైట్ హక్కులు అమ్మాల్సి ఉంది. సినిమా బ్లాక్బస్టర్ అయిన నేపథ్యంలో ఆ రైట్స్ కూడా మంచి రేటే పలికే అవకాశముంది. ఇక రీమేక్ హక్కుల ద్వారానూ ‘ఉప్పెన’ నిర్మాతల పంట పండించేలా ఉంది. ఇప్పటికే తమిళ రీమేక్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. విజయ్ కొడుకును హీరోగా పరిచయం చేయడానికి ‘ఉప్పెన’ను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా హిందీ రీమేక్ గురించి కూడా వార్తలొస్తున్నాయి. ‘ఖాలి పీలి’ జంట ఇషాన్ ఖట్టర్, అనన్య పాండేలతో ‘ఉప్పెన’ను హిందీలో రీమేక్ చేయడానికి ఓ అగ్ర నిర్మాణ సంస్థ సంప్రదింపులు జరుపుతోందట. హిందీ రీమేక్ అంటే రేటు భారీగానే ఉంటుంది. ఇక తెలుగులో హిట్టయిన ప్రతి సినిమానూ రీమేక్ చేసే కన్నడ నిర్మాతలు కూడా ‘ఉప్పెన’ కోసం పోటీ పడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే అనూహ్యమైన లాభాలందించిన ‘ఉప్పెన’.. అవన్నీ చాలవని ఇతర మార్గాల్లోనూ భారీగానే నిర్మాతలకు ఆదాయం సమకూర్చిపెడుతుండటం విశేషం.
This post was last modified on February 23, 2021 11:42 pm
అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…
భాగ్యనగరం హైదరాబాద్లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక యువ…
రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…