ఒక పరభాషా నటుడికి తెలుగులో కొంచెం క్రేజ్ వచ్చిందంటే చాలు. ఇక అతను ఇంతకుముందు నటించిన చిత్రాల్ని డబ్ చేసి రిలీజ్ చేయడం మొదలైపోతుంది. ఇంతకుముందు చాలా మంది తమిళ నటుల విషయంలో ఇదే జరిగింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్కు ‘జనతా గ్యారేజ్’తో క్రేజ్ రావడంతో ‘మన్యంపులి’ సహా వరుసగా ఆయన మలయాళ చిత్రాల్ని అనువాదం చేసి రిలీజ్ చేయడం తెలిసిన సంగతే.
ఇప్పుడు విజయ్ సేతుపతి విషయంలోనూ ఇలాగే జరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘మాస్టర్’; ‘ఉప్పెన’ చిత్రాలతో సేతుపతికి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఈ రెండు సినిమాలకు అతను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సేతుపతి తెరపై కనిపించినపుడు థియేటర్లలో వచ్చిన స్పందన చూస్తే అతడికి ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇకపై తమిళంలో సేతుపతి నటించే సినిమాలన్నీ తెలుగులోకి వచ్చేసేలా ఉన్నాయి.
సేతుపతి ఇంతకుముందు చేసిన ఓ సెన్సేషనల్ మూవీని హఠాత్తుగా తెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. సమంత కూడా ఓ కీలక పాత్ర చేసిన ఆ సినిమా పేరు.. సూపర్ డీలక్స్. ఇది ఒక అసాధారణ కథతో తెరకెక్కిన సంచలన చిత్రం. ఇందులో సేతుపతి లింగ మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారిన వ్యక్తిగా కనిపించడం విశేషం. సినిమాలో అతడి పాత్ర చాలా షాకింగ్గా ఉంటుంది. ఆ పాత్రతో ముడిపడ్డ కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తాయి.
కొందరు అవి జీర్ణించుకోలేరు కూడా. అలాగే సమంత పాత్ర సైతం సెన్సేషనల్గానే ఉంటుంది. సినిమా ఆరంభంలోనే ఆ పాత్రకు సంబంధించి పెద్ద ట్విస్టుంటుంది. సమంతను తెలుగులో ట్రెడిషనల్ క్యారెక్టర్లలో చూసిన వాళ్లు ఈ పాత్ర చూశాక షాకవుతారు. ఇంతకుముందు ‘ఆరణ్య కాండం’తో జాతీయ అవార్డు సాధించిన త్యాగరాజన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్ర అనువాద హక్కుల్ని ఫ్యాన్సీ రేటుకు కొన్న ఓ సంస్థ త్వరలోనే తెలుగులో రిలీజ్ చేయబోతోంది. తెలుగులో ఈ చిత్రం ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on February 23, 2021 3:40 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…