ఇబ్బందుల్లో ఉన్న తన కెరీర్ను తిరిగి గాడిన పెడుతుందని ‘కపటధారి’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సుమంత్. కానీ ఆ చిత్రం అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. కెరీర్ను ఉపునివ్వకపోగా.. ఇంకా దెబ్బ తినేలా చేసేట్లుందీ చిత్రం. ఈ శుక్రవారం విడుదలైన ‘కపటధారి’కి వచ్చిన టాక్, దాని బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుందని విడుదలకు ముందు సుమంత్ ధీమాగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఇది కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కపటధారి’కి రీమేక్.
ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేశారు. తమిళంలో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా ఈ సినిమా తీశారు. అది జనవరి నెలాఖర్లోనే విడుదలైంది. మంచి రివ్యూలు తెచ్చుకుంది. హిట్ కూడా అయింది. దీంతో తెలుగులోనూ సినిమా విజయవంతం కావడం లాంఛనమే అనుకున్నారు. ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే అనిపించింది.
కానీ ‘కపటధారి’ సినిమా చూసిన జనాలు మాత్రం పెదవి విరుస్తున్నారు. మాతృకను యాజిటీజ్ ఫాలో అయిపోయినా.. అందులోని ఫీల్ ఇందులో లేదు. కథాంశం బాగున్నప్పటికీ థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన ఉత్కంఠ, బిగి, వేగం ఇందులో మిస్సయ్యాయని అంటున్నారు. సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా సుమంత్కు లేదు. అతడి సినిమా చాలా బాగుందంటే తప్ప థియేటర్లకు జనాలు రారు. ప్రస్తుతం ప్రేక్షకులకు థియేటర్లలో వేరే ఆప్షన్లు ఉన్నాయి.
ముందు వారం వచ్చిన ‘ఉప్పెన’ ఇప్పటికీ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ వారం సినిమాల్లో ‘నాంది’ మంచి టాక్ తెచ్చుకుంది. వాటికే ప్రేక్షకులు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. విశాల్ సినిమా ‘చక్ర’కు కూడా ఓ మోస్తరుగా స్పందన ఉంది కానీ.. ‘కపటధారి’నే ఈ బాక్సాఫీస్ పోరులో అన్యాయం అయిపోయినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలు షాకింగ్గా ఉన్నాయి. ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి. స్క్రీన్లు కూడా బాగా తగ్గించేశారు. ‘నాంది’కి పెంచారు. ‘ఉప్పెన’కు తగ్గించిన స్క్రీన్లు మళ్లీ దానికే యాడ్ అయ్యాయి. ఇక బుక్ మై షోలో ‘కపటధారి’ బుకింగ్స్ చూస్తే సినిమా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది.
This post was last modified on February 22, 2021 7:06 pm
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…