ఇబ్బందుల్లో ఉన్న తన కెరీర్ను తిరిగి గాడిన పెడుతుందని ‘కపటధారి’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సుమంత్. కానీ ఆ చిత్రం అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. కెరీర్ను ఉపునివ్వకపోగా.. ఇంకా దెబ్బ తినేలా చేసేట్లుందీ చిత్రం. ఈ శుక్రవారం విడుదలైన ‘కపటధారి’కి వచ్చిన టాక్, దాని బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుందని విడుదలకు ముందు సుమంత్ ధీమాగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఇది కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కపటధారి’కి రీమేక్.
ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేశారు. తమిళంలో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా ఈ సినిమా తీశారు. అది జనవరి నెలాఖర్లోనే విడుదలైంది. మంచి రివ్యూలు తెచ్చుకుంది. హిట్ కూడా అయింది. దీంతో తెలుగులోనూ సినిమా విజయవంతం కావడం లాంఛనమే అనుకున్నారు. ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే అనిపించింది.
కానీ ‘కపటధారి’ సినిమా చూసిన జనాలు మాత్రం పెదవి విరుస్తున్నారు. మాతృకను యాజిటీజ్ ఫాలో అయిపోయినా.. అందులోని ఫీల్ ఇందులో లేదు. కథాంశం బాగున్నప్పటికీ థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన ఉత్కంఠ, బిగి, వేగం ఇందులో మిస్సయ్యాయని అంటున్నారు. సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా సుమంత్కు లేదు. అతడి సినిమా చాలా బాగుందంటే తప్ప థియేటర్లకు జనాలు రారు. ప్రస్తుతం ప్రేక్షకులకు థియేటర్లలో వేరే ఆప్షన్లు ఉన్నాయి.
ముందు వారం వచ్చిన ‘ఉప్పెన’ ఇప్పటికీ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ వారం సినిమాల్లో ‘నాంది’ మంచి టాక్ తెచ్చుకుంది. వాటికే ప్రేక్షకులు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. విశాల్ సినిమా ‘చక్ర’కు కూడా ఓ మోస్తరుగా స్పందన ఉంది కానీ.. ‘కపటధారి’నే ఈ బాక్సాఫీస్ పోరులో అన్యాయం అయిపోయినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలు షాకింగ్గా ఉన్నాయి. ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి. స్క్రీన్లు కూడా బాగా తగ్గించేశారు. ‘నాంది’కి పెంచారు. ‘ఉప్పెన’కు తగ్గించిన స్క్రీన్లు మళ్లీ దానికే యాడ్ అయ్యాయి. ఇక బుక్ మై షోలో ‘కపటధారి’ బుకింగ్స్ చూస్తే సినిమా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది.
This post was last modified on February 22, 2021 7:06 pm
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…