రాజమౌళి పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తుల సినిమాలంటే అన్ని పనులూ వదులుకుని వచ్చి ప్రమోట్ చేస్తుంటాడు. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జక్కన్నకు అలాంటి సన్నిహితుడే. వీళ్లిద్దరి సినీ ప్రస్థానం దాదాపు ఒకేసారి మొదలైంది. ఇద్దరూ కలిసి కొన్నేళ్లు ట్రావెల్ చేశారు. తర్వాత ఇద్దరూ దర్శకులుగా మారారు. ఎవరి స్టయిల్లో వాళ్లు సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.
ఐతే రాజమౌళి కమర్షియల్ సినిమాలతో ఎక్కడికో వెళ్లిపోతే యేలేటి తన స్టయిల్లో విభిన్న సినిమాలు చేస్తూ ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. యేలేటి చివరగా తీసిన మనమంతా సినిమా కోసం రాజమౌళి స్పెషల్ ప్రమోషన్లు చేశాడు. యేలేటితో కలిసి టీవీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు తన మిత్రుడి కొత్త సినిమా చెక్ను ప్రమోట్ చేయడానికి కూడా రాజమౌళి ముందుకొచ్చాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరై మంచి మాటలు చెప్పాడు.
లాక్ డౌన్ బ్రేక్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయని, ఐతే ఈ మధ్య కాలంలో ఒక టీజర్ చూసి ఎప్పుడెప్పుడు థియేటరుకెళ్లి సినిమా చూద్దామా అనిపించింది చెక్ విషయంలోనే అని రాజమౌళి చెప్పాడు. టీజర్ అంత ఆసక్తికరంగా, కొత్తగా అనిపించిందని జక్కన్న అభిప్రాయపడ్డాడు. తెలుగులో మాస్, క్లాస్ సినిమాలు అనే తేడాలు తగ్గాయని.. ఐతే చెక్ సినిమాతో ఈ గీత పూర్తిగా చెరిగిపోతుందని తాను నమ్ముతున్నానని రాజమౌళి చెప్పాడు. ఇది క్లాస్ సినిమానే అయినప్పటికీ మాస్ సినిమా స్థాయిలో చాలా బాగా ఆడి ఆ అంతరాన్ని చెరిపేస్తుందని భావిస్తున్నట్లు ఆయనన్నారు.
హీరో నితిన్ ఒకప్పుడు ఒక పరిధిలో ఉండి ఇలాంటి సినిమాలే చేస్తాడు అనే ముద్ర వేసుకున్నాడని.. అలాంటి దశ నుంచి తనను తాను కొత్తగా మలుచుకుని విభిన్నమైన సినిమాలతో ప్రయాణం సాగిస్తున్నాడని.. చెక్ అతడి కెరీర్లో పెద్ద హిట్గా నిలుస్తుందని ఆశిస్తున్నానని జక్కన్న చెప్పాడు.
This post was last modified on February 22, 2021 7:36 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…