రాజమౌళి పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తుల సినిమాలంటే అన్ని పనులూ వదులుకుని వచ్చి ప్రమోట్ చేస్తుంటాడు. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జక్కన్నకు అలాంటి సన్నిహితుడే. వీళ్లిద్దరి సినీ ప్రస్థానం దాదాపు ఒకేసారి మొదలైంది. ఇద్దరూ కలిసి కొన్నేళ్లు ట్రావెల్ చేశారు. తర్వాత ఇద్దరూ దర్శకులుగా మారారు. ఎవరి స్టయిల్లో వాళ్లు సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.
ఐతే రాజమౌళి కమర్షియల్ సినిమాలతో ఎక్కడికో వెళ్లిపోతే యేలేటి తన స్టయిల్లో విభిన్న సినిమాలు చేస్తూ ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. యేలేటి చివరగా తీసిన మనమంతా సినిమా కోసం రాజమౌళి స్పెషల్ ప్రమోషన్లు చేశాడు. యేలేటితో కలిసి టీవీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు తన మిత్రుడి కొత్త సినిమా చెక్ను ప్రమోట్ చేయడానికి కూడా రాజమౌళి ముందుకొచ్చాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరై మంచి మాటలు చెప్పాడు.
లాక్ డౌన్ బ్రేక్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయని, ఐతే ఈ మధ్య కాలంలో ఒక టీజర్ చూసి ఎప్పుడెప్పుడు థియేటరుకెళ్లి సినిమా చూద్దామా అనిపించింది చెక్ విషయంలోనే అని రాజమౌళి చెప్పాడు. టీజర్ అంత ఆసక్తికరంగా, కొత్తగా అనిపించిందని జక్కన్న అభిప్రాయపడ్డాడు. తెలుగులో మాస్, క్లాస్ సినిమాలు అనే తేడాలు తగ్గాయని.. ఐతే చెక్ సినిమాతో ఈ గీత పూర్తిగా చెరిగిపోతుందని తాను నమ్ముతున్నానని రాజమౌళి చెప్పాడు. ఇది క్లాస్ సినిమానే అయినప్పటికీ మాస్ సినిమా స్థాయిలో చాలా బాగా ఆడి ఆ అంతరాన్ని చెరిపేస్తుందని భావిస్తున్నట్లు ఆయనన్నారు.
హీరో నితిన్ ఒకప్పుడు ఒక పరిధిలో ఉండి ఇలాంటి సినిమాలే చేస్తాడు అనే ముద్ర వేసుకున్నాడని.. అలాంటి దశ నుంచి తనను తాను కొత్తగా మలుచుకుని విభిన్నమైన సినిమాలతో ప్రయాణం సాగిస్తున్నాడని.. చెక్ అతడి కెరీర్లో పెద్ద హిట్గా నిలుస్తుందని ఆశిస్తున్నానని జక్కన్న చెప్పాడు.
This post was last modified on February 22, 2021 7:36 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…