ఉప్పెన ప్రి రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ చాలా ఉద్వేగంగానే మాట్లాడాడు. తన శిష్యుడు బుచ్చిబాబు సానా చాలా గొప్ప సినిమా తీశాడని.. ఈ కథ విన్నపుడే తాను చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పాడు. ఈ కథ చాలా గొప్పది కాబట్టే స్వయంగా చెన్నైకి వెళ్లి రాయణం పాత్రకు విజయ్ సేతుపతిని పట్టుబట్టి ఒప్పించానన్నాడు. అంతే కాదు.. ఈ కథ విన్న వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్కు ఫోన్ చేసి ఇది వంద కోట్ల సినిమా అవుతుందని అన్నట్లు చెప్పాడు.
ఈ మాటను సుక్కు కొంచెం నొక్కి వక్కాణించడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. శిష్యుడు సినిమాను సేల్ చేయడానికి సుక్కు గట్టిగా ప్రయత్నిస్తున్నాడని.. కొత్త హీరో హీరోయిన్లతో ఓ కొత్త దర్శకుడు తీసిన ఉప్పెనను వంద కోట్ల సినిమాగా పేర్కొనడం ఏంటి అనుకున్నారు. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఉప్పెన జోరు చూస్తుంటే అప్పుడు అతిశయోక్తిలా అనిపించిన మాటే నిజమవుతుందేమో అనిపిస్తోంది.
మూడు రోజులు తిరిగేసరికే ఉప్పెన ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేసింది. షేర్ రూ.28 కోట్లను దాటిపోయింది. ఇంకో రెండు వారాలు ఈ సినిమా జోరు కొనసాగేలా కనిపిస్తోంది. వీకెండ్ అయ్యాక సోమవారం కూడా ఉప్పెన బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. వచ్చే రెండు మూడు వారాంతాల్లోనూ ఇతర సినిమాల పోటీని తట్టుకుని ఉప్పెన నిలబడుతుందనే అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం రూ.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇక ఈ చిత్ర డిజిటల్ హక్కులకూ మంచి రేటే పలికినట్లు చెబుతున్నారు. ఇంకా శాటిలైట్ హక్కులు అమ్మాల్సి ఉంది. రీమేక్, డబ్బింగ్ హక్కుల కోసమూ మంచి ఆఫర్లు వచ్చే అవకాశముంది. ఇలా అన్ని మార్గాల్లో కలిపి మొత్తంగా ఉప్పెన రూ.100 కోట్లు రాబట్టినా రాబట్టి సుకుమార్ మాటను నిజం చేసినా చేయొచ్చేమో.
This post was last modified on February 16, 2021 11:48 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…