ఉప్పెన ప్రి రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ చాలా ఉద్వేగంగానే మాట్లాడాడు. తన శిష్యుడు బుచ్చిబాబు సానా చాలా గొప్ప సినిమా తీశాడని.. ఈ కథ విన్నపుడే తాను చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పాడు. ఈ కథ చాలా గొప్పది కాబట్టే స్వయంగా చెన్నైకి వెళ్లి రాయణం పాత్రకు విజయ్ సేతుపతిని పట్టుబట్టి ఒప్పించానన్నాడు. అంతే కాదు.. ఈ కథ విన్న వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్కు ఫోన్ చేసి ఇది వంద కోట్ల సినిమా అవుతుందని అన్నట్లు చెప్పాడు.
ఈ మాటను సుక్కు కొంచెం నొక్కి వక్కాణించడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. శిష్యుడు సినిమాను సేల్ చేయడానికి సుక్కు గట్టిగా ప్రయత్నిస్తున్నాడని.. కొత్త హీరో హీరోయిన్లతో ఓ కొత్త దర్శకుడు తీసిన ఉప్పెనను వంద కోట్ల సినిమాగా పేర్కొనడం ఏంటి అనుకున్నారు. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఉప్పెన జోరు చూస్తుంటే అప్పుడు అతిశయోక్తిలా అనిపించిన మాటే నిజమవుతుందేమో అనిపిస్తోంది.
మూడు రోజులు తిరిగేసరికే ఉప్పెన ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేసింది. షేర్ రూ.28 కోట్లను దాటిపోయింది. ఇంకో రెండు వారాలు ఈ సినిమా జోరు కొనసాగేలా కనిపిస్తోంది. వీకెండ్ అయ్యాక సోమవారం కూడా ఉప్పెన బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. వచ్చే రెండు మూడు వారాంతాల్లోనూ ఇతర సినిమాల పోటీని తట్టుకుని ఉప్పెన నిలబడుతుందనే అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం రూ.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇక ఈ చిత్ర డిజిటల్ హక్కులకూ మంచి రేటే పలికినట్లు చెబుతున్నారు. ఇంకా శాటిలైట్ హక్కులు అమ్మాల్సి ఉంది. రీమేక్, డబ్బింగ్ హక్కుల కోసమూ మంచి ఆఫర్లు వచ్చే అవకాశముంది. ఇలా అన్ని మార్గాల్లో కలిపి మొత్తంగా ఉప్పెన రూ.100 కోట్లు రాబట్టినా రాబట్టి సుకుమార్ మాటను నిజం చేసినా చేయొచ్చేమో.
This post was last modified on February 16, 2021 11:48 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…