బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య పోటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దల నుంచి వీరి మధ్య బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. ఇద్దరూ మంచి మిత్రుల్లాగే కనిపిస్తారు కానీ.. వారి అభిమానులకు మాత్రం పరస్పర వ్యతిరేక భావాలున్నాయి. ఒకరి హీరోను ఒకళ్లు టార్గెట్ చేస్తుంటారు. ట్రోల్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో షారుఖ్, సల్మాన్ మధ్య విభేదాలు నెలకొని దూరం దూరంగా ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది.
బాలీవుడ్ నంబర్ వన్ కిరీటం కోసం ఒకప్పుడు వీరి మధ్య గట్టి పోటీ ఉండేది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. కెరీర్ ఆరంభంలో ‘కరణ్ అర్జున్’తో పాటు కొన్ని సినిమాల్లో నటించిన ఈ సూపర్ స్టార్లు.. గత దశాబ్ద కాలంలో ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రలు చేశారు. సల్మానే ఎక్కువగా షారుఖ్ చిత్రాల్లో కనిపించడం తెలిసిన సంగతి తెలిసిందే. ఈ పదేళ్లలో షారుఖ్ తన ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోయి హిట్టు కోసం నానా అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే.
రెండేళ్లకు పైగా విరామం తీసుకుని షారుఖ్ ప్రస్తుతం ‘పఠాన్’ అనే సినిమాలో నటిస్తుండగా.. ఆ చిత్రంలో సల్మాన్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు ఇంతకుముందే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ విషయం అధికారికంగా వెల్లడైంది. ‘పఠాన్’లో తాను ఓ కీలక పాత్ర చేయనున్నట్లు, త్వరలోనే ఆ చిత్రం షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సల్మాన్ వెల్లడించాడు. తాజాగా తాను హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోలో సల్మాన్ ఈ విషయం తెలిపాడు.
బిగ్ బాస్ కొత్త సీజన్ పూర్తయ్యాక తాను నటించబోయే తొలి చిత్రం ‘పఠాన్’యే అని అతను వెల్లడించాడు. దీంతో పాటు ‘టైగర్-3’లోనూ నటిస్తానన్నాడు. ఈ చిత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో మనీశ్ శర్మ ద్శకత్వంలో తెరకెక్కనుంది. దాని తర్వాత రైటర్ టర్న్డ్ డైరెక్టర్ ఫర్హద్ సామ్జీ డైరెక్షన్లో ‘కబీ ఈద్ కబీ దివాలి’లో సల్మాన్ నటించబోతున్నాడు. ఈ మూడు చిత్రాలూ పూర్తి చేసి వచ్చే ఏడాది మళ్లీ బిగ్ బాస్ కొత్త సీజన్కు వస్తానని సల్మాన్ ఖాన్ వెల్లడించాడు. సల్మాన్ ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో రాధె చిత్రాన్ని పూర్తి చేయగా అది రంజాన్ కానుకగా విడుదల కానుంది.
This post was last modified on February 15, 2021 2:01 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…