Movie News

అవును.. షారుఖ్‌తో మళ్లీ నటిస్తున్నా-సల్మాన్


బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య పోటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దల నుంచి వీరి మధ్య బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. ఇద్దరూ మంచి మిత్రుల్లాగే కనిపిస్తారు కానీ.. వారి అభిమానులకు మాత్రం పరస్పర వ్యతిరేక భావాలున్నాయి. ఒకరి హీరోను ఒకళ్లు టార్గెట్ చేస్తుంటారు. ట్రోల్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో షారుఖ్, సల్మాన్ మధ్య విభేదాలు నెలకొని దూరం దూరంగా ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది.

బాలీవుడ్ నంబర్ వన్ కిరీటం కోసం ఒకప్పుడు వీరి మధ్య గట్టి పోటీ ఉండేది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. కెరీర్ ఆరంభంలో ‘కరణ్ అర్జున్’తో పాటు కొన్ని సినిమాల్లో నటించిన ఈ సూపర్ స్టార్లు.. గత దశాబ్ద కాలంలో ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రలు చేశారు. సల్మానే ఎక్కువగా షారుఖ్ చిత్రాల్లో కనిపించడం తెలిసిన సంగతి తెలిసిందే. ఈ పదేళ్లలో షారుఖ్ తన ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోయి హిట్టు కోసం నానా అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే.

రెండేళ్లకు పైగా విరామం తీసుకుని షారుఖ్ ప్రస్తుతం ‘పఠాన్’ అనే సినిమాలో నటిస్తుండగా.. ఆ చిత్రంలో సల్మాన్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు ఇంతకుముందే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ విషయం అధికారికంగా వెల్లడైంది. ‘పఠాన్’లో తాను ఓ కీలక పాత్ర చేయనున్నట్లు, త్వరలోనే ఆ చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సల్మాన్ వెల్లడించాడు. తాజాగా తాను హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోలో సల్మాన్ ఈ విషయం తెలిపాడు.

బిగ్ బాస్ కొత్త సీజన్ పూర్తయ్యాక తాను నటించబోయే తొలి చిత్రం ‘పఠాన్’యే అని అతను వెల్లడించాడు. దీంతో పాటు ‘టైగర్-3’లోనూ నటిస్తానన్నాడు. ఈ చిత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో మనీశ్ శర్మ ద్శకత్వంలో తెరకెక్కనుంది. దాని తర్వాత రైటర్ టర్న్డ్ డైరెక్టర్ ఫర్హద్ సామ్‌జీ డైరెక్షన్లో ‘కబీ ఈద్ కబీ దివాలి’లో సల్మాన్ నటించబోతున్నాడు. ఈ మూడు చిత్రాలూ పూర్తి చేసి వచ్చే ఏడాది మళ్లీ బిగ్ బాస్ కొత్త సీజన్‌కు వస్తానని సల్మాన్ ఖాన్ వెల్లడించాడు. సల్మాన్ ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో రాధె చిత్రాన్ని పూర్తి చేయగా అది రంజాన్ కానుకగా విడుదల కానుంది.

This post was last modified on February 15, 2021 2:01 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

8 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

4 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

8 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

8 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

9 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

9 hours ago