ఒక డైరెక్టర్ సక్సెస్ లో ఉండగా హీరోని కలిస్తే అతనేమీ చెప్తే అది హీరో చేస్తాడు. అదే ప్లాప్ ఇచ్చిన తర్వాత హీరోని కలిస్తే మాత్రం హీరో చెప్పింది చేయాలి. చరణ్ దగ్గరకు కథ పట్టుకెళ్లిన సాహో దర్శకుడు సుజీత్ అలాగే ఇప్పుడు చరణ్ చెప్పినట్టుగా లూసిఫెర్ రీమేక్ మీద వర్క్ చేస్తున్నాడు.
చిరంజీవితో చేసే ఈ రీమేక్ కోసం సుజీత్ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడు. అలాగే వేంకటాద్రి ఎక్స్ప్రెస్ దర్శకుడు మేర్లపాకగాంధీ కృష్ణార్జున యుద్ధం అనే ప్లాప్ తర్వాత నితిన్ ని కలిసాడు. ఆటను చెప్పిన కథ పక్కన పెట్టి అందాధూన్ రీమేక్ చేయమని నితిన్ అతనికి అప్పగించాడు. హీరోతో రిలేషన్ పోగొట్టుకోలేరు కనుక డైరెక్టర్స్ వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు.
ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే అప్పుడు వారికి హీరో ఇంకో ఛాన్స్ ఇస్తాడనేది వాళ్ళ నమ్మకం. రీమేక్ సినిమాలకి గతంలో మాదిరిగా ఇప్పుడు అంత క్రేజ్ లేదు. ఓటిటీ వల్ల వాటిని జనం ముందే చూసేస్తున్నారు కనుక దర్శకులు రీమేక్స్ పై ఆసక్తిగా లేరు. అందుకే హీరోలు ఇలాంటి డైరెక్టర్స్ కి ఆ పని అప్పగిస్తున్నారు.
This post was last modified on May 8, 2020 12:12 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచే కార్యక్రమానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం…
అనిరుధ్ రవిచందర్ తర్వాత తమిళ దర్శకులు ఎక్కువగా జపిస్తున్న పేరు సాయి అభ్యంక్కర్. కుర్రాడు చాలా చిన్న వయసులోనే మ్యూజిక్…