ఒక డైరెక్టర్ సక్సెస్ లో ఉండగా హీరోని కలిస్తే అతనేమీ చెప్తే అది హీరో చేస్తాడు. అదే ప్లాప్ ఇచ్చిన తర్వాత హీరోని కలిస్తే మాత్రం హీరో చెప్పింది చేయాలి. చరణ్ దగ్గరకు కథ పట్టుకెళ్లిన సాహో దర్శకుడు సుజీత్ అలాగే ఇప్పుడు చరణ్ చెప్పినట్టుగా లూసిఫెర్ రీమేక్ మీద వర్క్ చేస్తున్నాడు.
చిరంజీవితో చేసే ఈ రీమేక్ కోసం సుజీత్ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడు. అలాగే వేంకటాద్రి ఎక్స్ప్రెస్ దర్శకుడు మేర్లపాకగాంధీ కృష్ణార్జున యుద్ధం అనే ప్లాప్ తర్వాత నితిన్ ని కలిసాడు. ఆటను చెప్పిన కథ పక్కన పెట్టి అందాధూన్ రీమేక్ చేయమని నితిన్ అతనికి అప్పగించాడు. హీరోతో రిలేషన్ పోగొట్టుకోలేరు కనుక డైరెక్టర్స్ వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు.
ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే అప్పుడు వారికి హీరో ఇంకో ఛాన్స్ ఇస్తాడనేది వాళ్ళ నమ్మకం. రీమేక్ సినిమాలకి గతంలో మాదిరిగా ఇప్పుడు అంత క్రేజ్ లేదు. ఓటిటీ వల్ల వాటిని జనం ముందే చూసేస్తున్నారు కనుక దర్శకులు రీమేక్స్ పై ఆసక్తిగా లేరు. అందుకే హీరోలు ఇలాంటి డైరెక్టర్స్ కి ఆ పని అప్పగిస్తున్నారు.
This post was last modified on May 8, 2020 12:12 am
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…