నందమూరి కళ్యాణ్ రామ్ వెండితెరపై కనిపించి ఏడాది దాటిపోయింది. గత ఏడాది సంక్రాంతికి ఎంత మంచివాడవురా సినిమాతో పలకరించాడతను. కొన్నేళ్ల పరాజయ పరంపరకు తెరదించుతూ 118తో మళ్లీ ఫామ్ అందుకున్న అతడికి ఎంత మంచివాడవురా పెద్ద షాకే ఇచ్చింది. కెరీర్లో మరో పెద్ద డిజాస్టర్గా నిలిచింది. పండుగ టైంలో రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కనీస స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుకోకపోవడం పెద్ద షాక్. ఆ షాక్ నుంచి కోలుకుని ఇంకో సినిమాను పట్టాలెక్కించడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్.
మధ్యలో అతను హీరోగా కొత్త సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. చివరగా మలయాళ థ్రిల్లర్ అంజామ్ పత్తిర రీమేక్లో నందమూరి హీరో నటించబోతున్నాడని గట్టి ప్రచారమే సాగింది. కానీ దాని సంగతి ఏమైందో తెలియదు. ఐతే ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త సినిమా కబురు బయటికొచ్చింది.
ఏజెంట్ వినోద్ అనే వింటేజ్ టచ్ ఉన్న థ్రిల్లర్ మూవీలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నాడన్నది తాజా సమాచారం. ఇందులో నందమూరి హీరో డిటెక్టివ్ పాత్రను పోషించబోతున్నాడట. ఇంతకుముందు అవసరాల శ్రీనివాస్ హీరోగా బాబు బాగా బిజీ అనే అడల్డ్ కామెడీని డైరెక్ట్ చేసిన నవీన్ మేడారం ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట.
తొలి సినిమా రీమేక్ కావడం, అది ఫ్లాప్ కావడంతో నవీన్ ప్రతిభేంటో ఎవరికీ తెలియలేదు. ఐతే అతను అదిరిపోయే థ్రిల్లర్ కథతో కళ్యాణ్ రామ్ను ఇంప్రెస్ చేసినట్లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని అతను సొంత బేనర్లోనే నిర్మించబోతున్నట్లు కూడా చెబుతున్నారు. 1940 నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. పెద్ద బడ్జెట్లోనే సినిమా తీయబోతున్నారట. కళ్యాణ్ రామ్ సరికొత్త గెటప్లో కనిపిస్తాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.
This post was last modified on February 13, 2021 10:29 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…