బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పరంగా చూస్తే సౌత్ ఇండియా అనే కాదు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి, శంకర్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. కమర్షియల్ సినిమాకు కొత్త అర్థం చెప్పి.. ప్రాంతీయ చిత్రాలకు తిరుగులేని స్థాయి అందించిన ఘనత ఈ ఇద్దరి సొంతం. శంకర్ కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలతో అసాధారణమైన ఫాలోయింగ్, ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంటే.. కెరీర్లో తొలి అర్ధంలో మామూలు కమర్షియల్ సినిమాలే తీసిన రాజమౌళి.. ద్వితీయార్ధ:లో మగధీర, ఈగ, బాహుబలి లాంటి అద్భుత చిత్రాలతో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్లిపోయాడు.
ఈ ఇద్దరు దర్శకులతో పని చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎంతగా తహతహలాడుతారో తెలిసిందే. వీరిలో ఒక్కరితో ఓ సినిమా చేసినా చాలని హీరోలు అనుకుంటారు. ఇక ఆ ఇద్దరితో సినిమా చేసే అవకాశం వస్తే..? ఇప్పటిదాకా ఆ ఘనత ఎవరికీ సొంతం కాలేదు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ అరుదైన అవకాశాన్ని అందుకున్నాడు.
ఇప్పటికే రాజమౌళితో ‘మగధీర’ లాంటి మెగా బ్లాక్బస్టర్ చేసిన రామ్ చరణ్.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజయ్యాక రామ్ చరణ్ స్థాయే మారిపోతుందని అంతా అనుకుంటున్నారు. ప్రభాస్ లాగా పాన్ ఇండియా స్టార్గా అవతరించే అవకాశమున్న చరణ్.. దీని తర్వాత ఎలాంటి సినిమాను లైన్లో పెడతాడా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. అతను శంకర్తో సినిమాను ఓకే చేసుకున్నాడు.
రాజమౌళి, శంకర్లతో వరుసగా సినిమాలు చేసే అవకాశమంటే మామూలు విషయం కాదు. సౌత్ ఇండియా అనే కాదు.. ఇండియాలోనే మరే హీరోకూ సాధ్యం కాని విషయం. శంకర్తో పని చేయాలని టాలీవుడ్ స్టార్లలో చాలామంది ఆశపడ్డారు. చరణ్ తండ్రి చిరంజీవి సైతం ఆ కోరికను బహిరంగంగా వ్యక్తం చేసిన వాడే. కానీ ఆయనకు దక్కని అవకాశం చరణ్ దక్కించుకున్నాడు. శంకర్ ఒకప్పటి స్థాయిలో ఫామ్లో లేకపోయినా.. ఇప్పటికీ ఆయన శ్రద్ధ పెడితే అద్భుతమైన సినిమా తీయగలడన్న అంచనాలున్నాయి. చరణ్తో అలాంటి సినిమానే అందిస్తాడేమో చూడాలి.
This post was last modified on February 13, 2021 10:08 pm
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…