బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పరంగా చూస్తే సౌత్ ఇండియా అనే కాదు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి, శంకర్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. కమర్షియల్ సినిమాకు కొత్త అర్థం చెప్పి.. ప్రాంతీయ చిత్రాలకు తిరుగులేని స్థాయి అందించిన ఘనత ఈ ఇద్దరి సొంతం. శంకర్ కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలతో అసాధారణమైన ఫాలోయింగ్, ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంటే.. కెరీర్లో తొలి అర్ధంలో మామూలు కమర్షియల్ సినిమాలే తీసిన రాజమౌళి.. ద్వితీయార్ధ:లో మగధీర, ఈగ, బాహుబలి లాంటి అద్భుత చిత్రాలతో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్లిపోయాడు.
ఈ ఇద్దరు దర్శకులతో పని చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎంతగా తహతహలాడుతారో తెలిసిందే. వీరిలో ఒక్కరితో ఓ సినిమా చేసినా చాలని హీరోలు అనుకుంటారు. ఇక ఆ ఇద్దరితో సినిమా చేసే అవకాశం వస్తే..? ఇప్పటిదాకా ఆ ఘనత ఎవరికీ సొంతం కాలేదు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ అరుదైన అవకాశాన్ని అందుకున్నాడు.
ఇప్పటికే రాజమౌళితో ‘మగధీర’ లాంటి మెగా బ్లాక్బస్టర్ చేసిన రామ్ చరణ్.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజయ్యాక రామ్ చరణ్ స్థాయే మారిపోతుందని అంతా అనుకుంటున్నారు. ప్రభాస్ లాగా పాన్ ఇండియా స్టార్గా అవతరించే అవకాశమున్న చరణ్.. దీని తర్వాత ఎలాంటి సినిమాను లైన్లో పెడతాడా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. అతను శంకర్తో సినిమాను ఓకే చేసుకున్నాడు.
రాజమౌళి, శంకర్లతో వరుసగా సినిమాలు చేసే అవకాశమంటే మామూలు విషయం కాదు. సౌత్ ఇండియా అనే కాదు.. ఇండియాలోనే మరే హీరోకూ సాధ్యం కాని విషయం. శంకర్తో పని చేయాలని టాలీవుడ్ స్టార్లలో చాలామంది ఆశపడ్డారు. చరణ్ తండ్రి చిరంజీవి సైతం ఆ కోరికను బహిరంగంగా వ్యక్తం చేసిన వాడే. కానీ ఆయనకు దక్కని అవకాశం చరణ్ దక్కించుకున్నాడు. శంకర్ ఒకప్పటి స్థాయిలో ఫామ్లో లేకపోయినా.. ఇప్పటికీ ఆయన శ్రద్ధ పెడితే అద్భుతమైన సినిమా తీయగలడన్న అంచనాలున్నాయి. చరణ్తో అలాంటి సినిమానే అందిస్తాడేమో చూడాలి.
This post was last modified on February 13, 2021 10:08 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…