టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకడు. 20 ఏళ్ల నుంచి ఆయన ఘన ప్రస్థానం కొనసాగుతోంది. తెలుగులో ఎంతోమంది హీరోలను ఆయన పరిచయం చేశాడు. ఎంతోమంది హీరోలను తన సినిమాల ద్వారా స్టార్లను చేశాడు. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి కూడా ఒక హీరో రాబోతుండటం విశేషం. ఆ కుర్రాడి పేరు.. ఆశిష్ రెడ్డి.
దిల్ రాజుకు ఇతను కొడుకు కాదు కానీ, కొడుకు లాంటి వాడే. రాజు తమ్ముడు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో రాజు తర్వాత అంత కీలకం అయిన శిరీష్ రెడ్డి తనయుడే ఆశిష్ రెడ్డి. ఈ కుర్రాడిని హీరోగా పరిచయం చేయడం కోసం కొన్నేళ్ల ముందు నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి. హీరో కావడం కోసం అన్ని రకాలుగా అతను సన్నద్ధమయ్యాడు. ఎట్టకేలకు అతడి లాంచింగ్కు రంగం సిద్ధమైంది. ఆశిష్ తొలి సినిమా ఇప్పటికే చిత్రీకరణ దశలోనూ ఉంది.
రాజు మిత్రుడు, ఆయన నిర్మాణ భాగస్వామి కూడా అయిన బెక్కెం వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం చేసిన శ్రీ హర్ష దర్శకత్వంలో ఆశిష్ తొలి చిత్రం తెరకెక్కుతోంది. ‘హుషారు’ సినిమాతో శ్రీ హర్ష మంచి పేరే సంపాదించాడు. యూత్ ఫుల్ సినిమాలను బాగా డీల్ చేయగలడని పేరు తెచ్చుకున్నాడు. అతణ్నే ఆశిష్ సినిమా లాంచింగ్కు ఎంచుకున్నారు.
ఈ చిత్రానికి పెద్ద పెద్ద టెక్నీషియన్లనే పెట్టుకున్నాడు రాజు. అగ్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దీనికి స్వరాలు సమకూరుస్తుండగా.. శ్రీమంతుడు, సాహో లాంటి భారీ చిత్రాలకు పని చేసిన మధి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నాడు. ప్రేమదేశం, హ్యాపీడేస్ సినిమా కలయికలా ఈ చిత్రం ఉంటుందని ఈ సినిమా గురించి ఓ మీడియా సంస్థతో శిరీష్ రెడ్డి గొప్పగా చెప్పుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఆశిష్ ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారట.
This post was last modified on February 11, 2021 10:04 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…