నిర్మాతగా మారాక.. నటనపై దృష్టి తగ్గించాడు బండ్ల గణేష్. అక్కడా కొన్ని దెబ్బలు పడ్డాక – రాజకీయాలవైపు మళ్లాడు. తిరిగి.. ‘సరిలేరు నీకెవ్వరు’తో మేకప్ వేసుకున్నాడు.
మహేష్ సినిమా కాబట్టి, ‘సరిలేరుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తనకు నటుడిగా రీ ఎంట్రీ అవుతుందని భావించాడు. అయితే.. ఆ సినిమా తనకు ప్లస్ గా మారలేదు సరికదా, మైనస్ అయిపోయింది. తన పాత్ర ముందు చెప్పినట్టు లేదని, ఎడిటింగ్ లో లేచిపోయిందని ఆ తరవాత వాపోయాడు. ఇలాంటి పాత్రలు చేయకూడదని గట్టిగా ఫిక్సయ్యాడు.
ఇప్పుడు గణేష్ రీ.. రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మారుతి సినిమాతో. గోపీచంద్ – మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మారుతికి ఓ పాత్ర దక్కింది.
నిజానికి మారుతి గత సినిమా ‘ప్రతిరోజూ పండగే’ లో బండ్లకి ఓ పాత్ర దక్కాల్సింది. కానీ కుదర్లేదు. ఈసారి మాత్రం బండ్లకు ఓ మంచి పాత్రే రాశాడట గణేష్. ఈ సినిమాతో నటుడిగా తనకు మంచి బ్రేక్ వస్తుందని ఫీలవుతున్నాడు బండ్ల. మరి ఈ రీ.. రీ.. ఎంట్రీ ఏమవ్వబోతోందో?
This post was last modified on February 9, 2021 3:00 pm
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…