నిర్మాతగా మారాక.. నటనపై దృష్టి తగ్గించాడు బండ్ల గణేష్. అక్కడా కొన్ని దెబ్బలు పడ్డాక – రాజకీయాలవైపు మళ్లాడు. తిరిగి.. ‘సరిలేరు నీకెవ్వరు’తో మేకప్ వేసుకున్నాడు.
మహేష్ సినిమా కాబట్టి, ‘సరిలేరుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తనకు నటుడిగా రీ ఎంట్రీ అవుతుందని భావించాడు. అయితే.. ఆ సినిమా తనకు ప్లస్ గా మారలేదు సరికదా, మైనస్ అయిపోయింది. తన పాత్ర ముందు చెప్పినట్టు లేదని, ఎడిటింగ్ లో లేచిపోయిందని ఆ తరవాత వాపోయాడు. ఇలాంటి పాత్రలు చేయకూడదని గట్టిగా ఫిక్సయ్యాడు.
ఇప్పుడు గణేష్ రీ.. రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మారుతి సినిమాతో. గోపీచంద్ – మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మారుతికి ఓ పాత్ర దక్కింది.
నిజానికి మారుతి గత సినిమా ‘ప్రతిరోజూ పండగే’ లో బండ్లకి ఓ పాత్ర దక్కాల్సింది. కానీ కుదర్లేదు. ఈసారి మాత్రం బండ్లకు ఓ మంచి పాత్రే రాశాడట గణేష్. ఈ సినిమాతో నటుడిగా తనకు మంచి బ్రేక్ వస్తుందని ఫీలవుతున్నాడు బండ్ల. మరి ఈ రీ.. రీ.. ఎంట్రీ ఏమవ్వబోతోందో?
This post was last modified on February 9, 2021 3:00 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…