నిర్మాతగా మారాక.. నటనపై దృష్టి తగ్గించాడు బండ్ల గణేష్. అక్కడా కొన్ని దెబ్బలు పడ్డాక – రాజకీయాలవైపు మళ్లాడు. తిరిగి.. ‘సరిలేరు నీకెవ్వరు’తో మేకప్ వేసుకున్నాడు.
మహేష్ సినిమా కాబట్టి, ‘సరిలేరుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తనకు నటుడిగా రీ ఎంట్రీ అవుతుందని భావించాడు. అయితే.. ఆ సినిమా తనకు ప్లస్ గా మారలేదు సరికదా, మైనస్ అయిపోయింది. తన పాత్ర ముందు చెప్పినట్టు లేదని, ఎడిటింగ్ లో లేచిపోయిందని ఆ తరవాత వాపోయాడు. ఇలాంటి పాత్రలు చేయకూడదని గట్టిగా ఫిక్సయ్యాడు.
ఇప్పుడు గణేష్ రీ.. రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మారుతి సినిమాతో. గోపీచంద్ – మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మారుతికి ఓ పాత్ర దక్కింది.
నిజానికి మారుతి గత సినిమా ‘ప్రతిరోజూ పండగే’ లో బండ్లకి ఓ పాత్ర దక్కాల్సింది. కానీ కుదర్లేదు. ఈసారి మాత్రం బండ్లకు ఓ మంచి పాత్రే రాశాడట గణేష్. ఈ సినిమాతో నటుడిగా తనకు మంచి బ్రేక్ వస్తుందని ఫీలవుతున్నాడు బండ్ల. మరి ఈ రీ.. రీ.. ఎంట్రీ ఏమవ్వబోతోందో?
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…