నిర్మాతగా మారాక.. నటనపై దృష్టి తగ్గించాడు బండ్ల గణేష్. అక్కడా కొన్ని దెబ్బలు పడ్డాక – రాజకీయాలవైపు మళ్లాడు. తిరిగి.. ‘సరిలేరు నీకెవ్వరు’తో మేకప్ వేసుకున్నాడు.
మహేష్ సినిమా కాబట్టి, ‘సరిలేరుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తనకు నటుడిగా రీ ఎంట్రీ అవుతుందని భావించాడు. అయితే.. ఆ సినిమా తనకు ప్లస్ గా మారలేదు సరికదా, మైనస్ అయిపోయింది. తన పాత్ర ముందు చెప్పినట్టు లేదని, ఎడిటింగ్ లో లేచిపోయిందని ఆ తరవాత వాపోయాడు. ఇలాంటి పాత్రలు చేయకూడదని గట్టిగా ఫిక్సయ్యాడు.
ఇప్పుడు గణేష్ రీ.. రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మారుతి సినిమాతో. గోపీచంద్ – మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మారుతికి ఓ పాత్ర దక్కింది.
నిజానికి మారుతి గత సినిమా ‘ప్రతిరోజూ పండగే’ లో బండ్లకి ఓ పాత్ర దక్కాల్సింది. కానీ కుదర్లేదు. ఈసారి మాత్రం బండ్లకు ఓ మంచి పాత్రే రాశాడట గణేష్. ఈ సినిమాతో నటుడిగా తనకు మంచి బ్రేక్ వస్తుందని ఫీలవుతున్నాడు బండ్ల. మరి ఈ రీ.. రీ.. ఎంట్రీ ఏమవ్వబోతోందో?
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…