రెండున్నరేళ్ల కిందట తెలుగులో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్న సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత మంచి ఫలితాన్నందుకోలేదు కానీ.. తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి అనడంలో సందేహం లేదు. తెలుగులో ఇలాంటి సినిమా ఇంతకుముందు రాలేదంటే అతిశయోక్తి కాదు. కొత్త దర్శకుడు వెంకటేష్ మహా వైజాగ్ శివార్లలోని కంచరపాలేనికి వెళ్లి అక్కడే ఆర్నెల్లు గడిపి అక్కడి మనుషులు, వారి మనస్తత్వాల్ని గమనించి.. అక్కడి వాళ్లనే ప్రధాన పాత్రలకు ఎంచుకుని అద్భుతమైన సినిమాను అందించాడు. ఈ చిత్రం కొన్ని అవార్డులను సైతం సొంతం చేసుకుంది.
ఇప్పుడీ సినిమా తమిళ ప్రేక్షకులనూ పలకరించబోతోంది రీమేక్ రూపంలో. తెలుగువాడే అయిన జాస్తి హేమాంబర్ అనే దర్శకుడు తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేశాడు. కేరాఫ్ కాదల్ పేరుతో తెరకెక్కిందీ చిత్రం. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ సైతం తెలుగు వెర్షన్తో పోలిస్తే డిట్టోలా అనిపిస్తోంది. రాజు పాత్రధారి పెళ్లి గురించి ఊరంతా చర్చించుకోవడం.. ప్రతి ఒక్కడికీ నా పెళ్లితోనేే పని అనడం.. ఇలాగే మొదలైంది ‘కేరాఫ్ కాదల్’ ట్రైలర్. తెలుగు వెర్షన్తో పోలిస్తే తమిళంలో ఏ చిన్న మార్పూ చేయలేదని స్పష్టమవుతోంది. తెలుగులో నటించిన ఇద్దరు నటులు తమిళంలోనూ అవే పాత్రల్ని పోషించడం విశేషం. తెలుగులో జోసెఫ్ పాత్ర చేసిన కార్తీక్ రత్నం, అలాగే మూగ ఆర్టిస్టుగా చేసిన నటుడు తమిళంలోనూ చేశారు.
ఐతే మాతృకను యాజిటీజ్ దించేసినప్పటికీ.. సోల్ మిస్ కాకుండా చూసుకున్నట్లే ఉన్నారు. ఈ చిత్రాన్ని వారం ముందే మీడియా వాళ్లకు ప్రివ్యూ షో వేయగా.. చూసిన వాళ్లందరూ సినిమా చాలా బాగుందనే అంటున్నారు. పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ‘సంక్రాంతి సినిమాల తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయిన సమయంలో వస్తున్న ‘కేరాఫ్ కాదల్ మంచి ఫలితమే అందుకుంటుందని భావిస్తున్నారు.
This post was last modified on February 9, 2021 2:02 pm
రోమ్లో ఉన్నపుడు రోమన్లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…