రెండున్నరేళ్ల కిందట తెలుగులో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్న సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత మంచి ఫలితాన్నందుకోలేదు కానీ.. తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి అనడంలో సందేహం లేదు. తెలుగులో ఇలాంటి సినిమా ఇంతకుముందు రాలేదంటే అతిశయోక్తి కాదు. కొత్త దర్శకుడు వెంకటేష్ మహా వైజాగ్ శివార్లలోని కంచరపాలేనికి వెళ్లి అక్కడే ఆర్నెల్లు గడిపి అక్కడి మనుషులు, వారి మనస్తత్వాల్ని గమనించి.. అక్కడి వాళ్లనే ప్రధాన పాత్రలకు ఎంచుకుని అద్భుతమైన సినిమాను అందించాడు. ఈ చిత్రం కొన్ని అవార్డులను సైతం సొంతం చేసుకుంది.
ఇప్పుడీ సినిమా తమిళ ప్రేక్షకులనూ పలకరించబోతోంది రీమేక్ రూపంలో. తెలుగువాడే అయిన జాస్తి హేమాంబర్ అనే దర్శకుడు తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేశాడు. కేరాఫ్ కాదల్ పేరుతో తెరకెక్కిందీ చిత్రం. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ సైతం తెలుగు వెర్షన్తో పోలిస్తే డిట్టోలా అనిపిస్తోంది. రాజు పాత్రధారి పెళ్లి గురించి ఊరంతా చర్చించుకోవడం.. ప్రతి ఒక్కడికీ నా పెళ్లితోనేే పని అనడం.. ఇలాగే మొదలైంది ‘కేరాఫ్ కాదల్’ ట్రైలర్. తెలుగు వెర్షన్తో పోలిస్తే తమిళంలో ఏ చిన్న మార్పూ చేయలేదని స్పష్టమవుతోంది. తెలుగులో నటించిన ఇద్దరు నటులు తమిళంలోనూ అవే పాత్రల్ని పోషించడం విశేషం. తెలుగులో జోసెఫ్ పాత్ర చేసిన కార్తీక్ రత్నం, అలాగే మూగ ఆర్టిస్టుగా చేసిన నటుడు తమిళంలోనూ చేశారు.
ఐతే మాతృకను యాజిటీజ్ దించేసినప్పటికీ.. సోల్ మిస్ కాకుండా చూసుకున్నట్లే ఉన్నారు. ఈ చిత్రాన్ని వారం ముందే మీడియా వాళ్లకు ప్రివ్యూ షో వేయగా.. చూసిన వాళ్లందరూ సినిమా చాలా బాగుందనే అంటున్నారు. పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ‘సంక్రాంతి సినిమాల తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయిన సమయంలో వస్తున్న ‘కేరాఫ్ కాదల్ మంచి ఫలితమే అందుకుంటుందని భావిస్తున్నారు.
This post was last modified on February 9, 2021 2:02 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…