రెండున్నరేళ్ల కిందట తెలుగులో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్న సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత మంచి ఫలితాన్నందుకోలేదు కానీ.. తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి అనడంలో సందేహం లేదు. తెలుగులో ఇలాంటి సినిమా ఇంతకుముందు రాలేదంటే అతిశయోక్తి కాదు. కొత్త దర్శకుడు వెంకటేష్ మహా వైజాగ్ శివార్లలోని కంచరపాలేనికి వెళ్లి అక్కడే ఆర్నెల్లు గడిపి అక్కడి మనుషులు, వారి మనస్తత్వాల్ని గమనించి.. అక్కడి వాళ్లనే ప్రధాన పాత్రలకు ఎంచుకుని అద్భుతమైన సినిమాను అందించాడు. ఈ చిత్రం కొన్ని అవార్డులను సైతం సొంతం చేసుకుంది.
ఇప్పుడీ సినిమా తమిళ ప్రేక్షకులనూ పలకరించబోతోంది రీమేక్ రూపంలో. తెలుగువాడే అయిన జాస్తి హేమాంబర్ అనే దర్శకుడు తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేశాడు. కేరాఫ్ కాదల్ పేరుతో తెరకెక్కిందీ చిత్రం. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ సైతం తెలుగు వెర్షన్తో పోలిస్తే డిట్టోలా అనిపిస్తోంది. రాజు పాత్రధారి పెళ్లి గురించి ఊరంతా చర్చించుకోవడం.. ప్రతి ఒక్కడికీ నా పెళ్లితోనేే పని అనడం.. ఇలాగే మొదలైంది ‘కేరాఫ్ కాదల్’ ట్రైలర్. తెలుగు వెర్షన్తో పోలిస్తే తమిళంలో ఏ చిన్న మార్పూ చేయలేదని స్పష్టమవుతోంది. తెలుగులో నటించిన ఇద్దరు నటులు తమిళంలోనూ అవే పాత్రల్ని పోషించడం విశేషం. తెలుగులో జోసెఫ్ పాత్ర చేసిన కార్తీక్ రత్నం, అలాగే మూగ ఆర్టిస్టుగా చేసిన నటుడు తమిళంలోనూ చేశారు.
ఐతే మాతృకను యాజిటీజ్ దించేసినప్పటికీ.. సోల్ మిస్ కాకుండా చూసుకున్నట్లే ఉన్నారు. ఈ చిత్రాన్ని వారం ముందే మీడియా వాళ్లకు ప్రివ్యూ షో వేయగా.. చూసిన వాళ్లందరూ సినిమా చాలా బాగుందనే అంటున్నారు. పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ‘సంక్రాంతి సినిమాల తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయిన సమయంలో వస్తున్న ‘కేరాఫ్ కాదల్ మంచి ఫలితమే అందుకుంటుందని భావిస్తున్నారు.
This post was last modified on February 9, 2021 2:02 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…