రెండున్నరేళ్ల కిందట తెలుగులో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్న సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత మంచి ఫలితాన్నందుకోలేదు కానీ.. తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి అనడంలో సందేహం లేదు. తెలుగులో ఇలాంటి సినిమా ఇంతకుముందు రాలేదంటే అతిశయోక్తి కాదు. కొత్త దర్శకుడు వెంకటేష్ మహా వైజాగ్ శివార్లలోని కంచరపాలేనికి వెళ్లి అక్కడే ఆర్నెల్లు గడిపి అక్కడి మనుషులు, వారి మనస్తత్వాల్ని గమనించి.. అక్కడి వాళ్లనే ప్రధాన పాత్రలకు ఎంచుకుని అద్భుతమైన సినిమాను అందించాడు. ఈ చిత్రం కొన్ని అవార్డులను సైతం సొంతం చేసుకుంది.
ఇప్పుడీ సినిమా తమిళ ప్రేక్షకులనూ పలకరించబోతోంది రీమేక్ రూపంలో. తెలుగువాడే అయిన జాస్తి హేమాంబర్ అనే దర్శకుడు తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేశాడు. కేరాఫ్ కాదల్ పేరుతో తెరకెక్కిందీ చిత్రం. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ సైతం తెలుగు వెర్షన్తో పోలిస్తే డిట్టోలా అనిపిస్తోంది. రాజు పాత్రధారి పెళ్లి గురించి ఊరంతా చర్చించుకోవడం.. ప్రతి ఒక్కడికీ నా పెళ్లితోనేే పని అనడం.. ఇలాగే మొదలైంది ‘కేరాఫ్ కాదల్’ ట్రైలర్. తెలుగు వెర్షన్తో పోలిస్తే తమిళంలో ఏ చిన్న మార్పూ చేయలేదని స్పష్టమవుతోంది. తెలుగులో నటించిన ఇద్దరు నటులు తమిళంలోనూ అవే పాత్రల్ని పోషించడం విశేషం. తెలుగులో జోసెఫ్ పాత్ర చేసిన కార్తీక్ రత్నం, అలాగే మూగ ఆర్టిస్టుగా చేసిన నటుడు తమిళంలోనూ చేశారు.
ఐతే మాతృకను యాజిటీజ్ దించేసినప్పటికీ.. సోల్ మిస్ కాకుండా చూసుకున్నట్లే ఉన్నారు. ఈ చిత్రాన్ని వారం ముందే మీడియా వాళ్లకు ప్రివ్యూ షో వేయగా.. చూసిన వాళ్లందరూ సినిమా చాలా బాగుందనే అంటున్నారు. పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ‘సంక్రాంతి సినిమాల తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయిన సమయంలో వస్తున్న ‘కేరాఫ్ కాదల్ మంచి ఫలితమే అందుకుంటుందని భావిస్తున్నారు.
This post was last modified on February 9, 2021 2:02 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…