గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి నాలుగు నెలలు దాటిపోయింది. ఇంకా కూడా ఆయన పేరు తలిస్తే అభిమానులు తీవ్ర ఉద్వేగానికి, ఆవేదనకు లోనవుతున్నారు. సంగీత దర్శకుడిగా బాలు మీద మరింత అభిమానం పెంచుకున్న దేవిశ్రీ ప్రసాద్.. తన తండ్రి సత్యమూర్తి మరణం తర్వాత తనను అంతగా బాధ పెట్టిన మరణం బాలుదే అంటూ ఓ ఇంటర్వ్యూలో ఉద్వేగానికి గురయ్యాడు.
ఇళయరాజాను, బాలును తాను దేవుళ్ల లాగే కొలుస్తానని, వారు లేకుంటే సినిమా పాటే లేదన్నది తన ఉద్దేశమని అన్న దేవిశ్రీ ప్రసాద్.. తనకు చిన్నతనంలో సంగీతం మీద అభిరుచి పుట్టినప్పటి నుంచి బాలుతో ఒక పాట పాడించాలని కలలు కన్నానని, సంగీత దర్శకుడిగా తన తొలి చిత్రం దేవితోనే ఆ కోరిక తీరిపోయిందని చెప్పాడు. బాలు ప్రతి పుట్టిన రోజుకూ ఆయనింటికి తాను వెళ్లేవాడినని అతను వెల్లడించాడు.
తాను స్వరపరిచిన, పాడిన పాటల్లో నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ అంటే బాలుకు ఎంతో ఇష్టమని.. ఆ పాటను ఆయన గాత్రంతో, తన స్టూడియోలో రికార్డు చేయాలని అనుకున్నారని, గత ఏడాది తన తండ్రి సత్యమూర్తి జయంతి రోజు ఈ పని చేయాలని ఇద్దరం బావించామని, కానీ కరోనా వల్ల అది సాధ్యపడలేదని దేవి చెప్పాడు. ఆ తర్వాత బాలు అకాల మరణంతో తమ ఇద్దరి కోరిక తీరకుండా మిగిలిపోయిందని దేవి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉప్పెన సినిమాలోనూ ఒక పాటను బాలుతో పాడించాలని అనుకున్నానని.. కానీ అదీ సాధ్యపడలేదని అతను చెప్పాడు. కొన్ని రోజుల కిందట రిలీజ్ చేసిన రంగులద్దుకున్న పాటను బాలు విని ఉంటే కచ్చితంగా తనను అభినందించేవాడని, అందుకే ఆయనకు ఆ పాటను అంకితమిచ్చానని దేవి తెలిపాడు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…