సరిగ్గా ఏడాది కిందట మలయాళంలో పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఓ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. లాక్ డౌన్ టైంలో భాషా భేదం లేకుండా ఆ సినిమాను విరగబడి చూశారు ప్రేక్షకులు. ఇప్పుడా సినిమా మూడు ప్రధాన భాషల్లో రీమేక్ కూడా అవుతోంది. ఆ సినిమానే.. అయ్యప్పనుం కోషీయుం.
పృథ్వీ రాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో రైటర్ టర్న్డ్ డైరెక్టర్ సాచి రూపొందించిన ఈ చిత్రం ఇద్దరు వ్యక్తుల మొదలైన చిన్న గొడవ ఇగో క్లాష్ కారణంగా ఏ స్థాయికి వెళ్లిందనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ కథానాయకుడు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలోనూ ఈ సినిమా రీమేక్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీ రీమేక్ కూడా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేసే నటులు కూడా ఖరారైనట్లు సమాచారం.
‘అయ్యప్పనుం కోషీయుం’ హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం సొంతం చేసుకున్నాడు. అతను ఇందులో నటించబోతున్నాడు కూడా. ఒరిజినల్లో బిజు చేసిన పాత్రను జాన్ చేయనున్నాడట. పృథ్వీ రాజ్ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ను అడుగుతున్నారట. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఖరారవ్వలేదు. తన టీంతో స్క్రిప్టును హిందీకి అనుగుణంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు జాన్ అబ్రహాం. అభిషేక్కు ఈ సినిమాలో నటించడానికి పెద్దగా అభ్యంతరాలు లేకపోవచ్చు.
జాన్, అభిషేక్ కలిసి ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించారు. అందులో ఒకటి.. ధూమ్. అదెంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ తర్వాత వీళ్లిద్దరూ ‘దోస్తానా’లో నటించారు. అది కూడా బాగానే ఆడింది. ఇప్పుడు మూడోసారి వీళ్లిద్దరూ జోడీ కట్టబోతున్నారు. త్వరలోనే ‘అయ్ప్పనుం కోషీయుం’ హిందీ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లనుందట. తమిళంలోనూ ఈ ఏడాదే దీని రీమేక్ మొదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on February 7, 2021 5:52 pm
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…