రీమేక్ .. రీమేక్ అనుకుంటాం గానీ, దాని కష్టాలు దానివే. ఉన్నది ఉన్నట్టు తీస్తే… కాపీ పేస్ట్ అంటారు. మార్పులూ చేర్పులూ చేసి, తేడా కొడితే చెడగొట్టేశామన్న నింద తప్పదు. అందుకే.. రీమేక్ విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. కొన్ని సినిమాలైతే మార్పులు చేయకపోవడమే మంచిది. అప్పప్పయుమ్ కోషియమ్ అలాంటి కథే. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ఇది. తెలుగులో పవన్ – రానా కాంబినేషన్లో రూపొందిస్తున్నారు.
సాగర్ చంద్ర దర్శకుడే అయినా.. తెర వెనుక, మాత్రం – త్రివిక్రమ్ హస్తమే ఎక్కువ. స్క్రీన్ ప్లే, మాటలూ అంటూ సింహభాగం ఆయనే సినిమాని నడిపిస్తున్నారు.
త్రివిక్రమ్ చేయి పడితే ఏముంది? కొత్త కొత్త మార్పులు పుట్టాల్సిందే. త్రివిక్రమ్ డైలాగ్స్ అంటే ఫన్, ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారు. అందుకే.. అది కూడా ఈ కథలో మిక్స్ చేసేశారు. పోలీస్ స్టేషన్లో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ.. లాంటి బ్యాచ్ని పెట్టి, వాళ్ల నుంచి వినోదం పిండే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అంతేకాదు.. పవన్ కల్యాణ్ కి ఓ ఫ్లాష్ బ్యాక్ జోడించార్ట. ఆ ఫ్లాష్ బ్యాక్ లోనూ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. అయ్యప్పయుమ్.. ఓ సీరియస్ సబ్జెక్ట్. ఈగో క్లాష్. అందులో ఫన్ ని మిక్స్ చేసే ప్రయత్నం, పవన్ పాత్రని పెంచేయడం కచ్చితంగా ఇబ్బంది కలిగించే విషయాలే.
త్రివిక్రమ్ తన మార్క్ చూపించడం కోసమో, పవన్ ఇమేజ్ని దృష్టిలో ఉంచుకుని ఆ పాత్ర నిడివి పెంచడమో చేస్తే.. కథ సైడ్ ట్రాక్ పట్టే ప్రమాదం ఉంది. త్రివిక్రమ్ ఈ సినిమాకి ప్లస్ అవ్వాలి తప్ప, మైనస్ గా మారకూడదు. అదే జరిగితే.. ఓ సూపర్ హిట్ కథని చేచేతులా పాడు చేసుకోవడమే అవుతుంది.
This post was last modified on February 6, 2021 5:06 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…