మళ్లీ ఓ శుక్రవారం వచ్చేసింది. కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తోంది. ఈ వారం ఓ విభిన్నమైన సినిమా థియేటర్లలోకి దిగుతోంది. అదే.. జాంబి రెడ్డి. ‘అ!’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్తో ‘కల్కి’ తీసిన ప్రశాంత్ వర్మ రూపొందించిన చిత్రమిది. హాలీవుడ్లో బాగా పాపులర్ అయిన జాంబీ జానర్ను టాలీవుడ్లోకి తీసుకొచ్చే సాహసం చేశాడీ చిత్రంతో ప్రశాంత్. ఇండియాలోనే ఈ జానర్లో చాలా తక్కువ సినిమాలు తెరకెక్కగా.. తెలుగులో అసలు జాంబీలతో పూర్తి స్థాయి సినిమా ఇప్పటిదాకా రాలేదు.
ఐతే ప్రయోగాలంటే ఆసక్తి చూపించే ప్రశాంత్.. జాంబీ జానర్ను రాయలసీమ ఫ్యాక్షనిజానికి ముడి పెట్టి ఈ సాహసోపేత చిత్రాన్ని తెరకెక్కించాడు. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ‘ఓ బేబీ’తో రీఎంట్రీ ఇచ్చిన తేజ ఈ చిత్రంతోనే హీరోగా పరిచయమవుతున్నాడు. దక్ష నగార్కర్, ఆనంది హీరోయిన్లుగా నటించారు.
సంక్రాంతి సందడి తర్వాత గత రెండు వారాల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయిన సమయంలో ‘జాంబి రెడ్డి’ విడుదలవుతోంది. ‘జాంబి రెడ్డి’ మీద ప్రేక్షకుల్లో ఓ మోస్తరుగా ఆసక్తి కనిపిస్తోంది. బుకింగ్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. ఐతే సినిమాకు స్టార్ పవర్ లేదు. ప్రశాంత్ ట్రాక్ రికార్డు మరీ గొప్పగా ఏమీ లేదు. కొత్త కాన్సెప్ట్ ఆకర్షిస్తున్నప్పటికీ.. జాంబీ సన్నివేశాల్ని మనవాళ్లు ఏ మాత్రం జీర్ణించుకుంటారన్నది ప్రశ్న.
ట్రైలర్ మరీ గోల గోలగా, కొంచెం ఎబ్బెట్టుగా ఉండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఐతే సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగానే వర్కవుటైనట్లు కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాల జోరు తగ్గిపోవడం, ఈ వారం చెప్పుకోదగ్గ వేరే సినిమాలేవీ లేకపోవడంతో ‘జాంబిరెడ్డి’కి థియేటర్లయితే పెద్ద సంఖ్యలోనే దక్కాయి. ఈ నేపథ్యంలో సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందన్నది కీలకం. ఓపెనింగ్స్ ఎలా ఉన్నా టాక్ బాగుంటే సినిమా బాగానే ఆడేయొచ్చు.
This post was last modified on February 5, 2021 11:36 am
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…